భాజపాతోనే మాదిగలకు న్యాయం
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు.
ఐక్యత చాటుతున్న భాజపా అభ్యర్థి అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్, శ్రీరాములు, రాజేశ్వర్రావు తదితరులు
వర్ధన్నపేట, న్యూస్టుడే: భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని ఓ వేడుకల మందిరంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో అరూరి పాల్గొని మాట్లాడారు. కడియం శ్రీహరి తెదేపా, భారాసలో ఉన్నత పదవులు అనుభవించి.. మిగిలిన దళిత నేతలను ఎదగకుండా చేసిన ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలోని దళిత నేతలకు టికెట్ రాకుండా చేశారని మండిపడ్డారు. అవసరాల కోసం పార్టీలు మారడం తప్ప కడియం శ్రీహరి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, రాజేశ్వర్రావు, హనుమకొండ జడ్పీ వైస్ ఛైర్మన్ గజ్జెల శ్రీరాములు, భాజపా నేతలు కేశవరెడ్డి, తిరుపతిరెడ్డి, కుమారస్వామి, మహేందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘మోదీ పాలనకు జనామోదం’
కాశీబుగ్గ, న్యూస్టుడే: దేశంలో పదేళ్ల మోదీ పాలనకు జనామోదం ఉందని, రానున్న ఎన్నికల ఫలితాల ద్వారా అది రుజువు కాబోతుందని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. వరంగల్ ఎనుమాములలో ఆదివారం వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావుతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు భాజపాలో చేరగా.. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. మోదీ పేరే నన్ను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు ముడుసు నర్సింహా, పత్రి సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాలనుసారం భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపునకు కృషి చేస్తామని ఎంఎస్పీ నేత మంద కుమార్మాదిగ ప్రకటించారు. వరంగల్ కాశీబుగ్గ పార్కులో ఆదివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో అరూరికి మద్దతుగా కరపత్రాలను ఆవిష్కరించారు. కట్ల రాజశేఖర్, చింతం సిద్ధూ, రాకేశ్కుమార్, వినయ్, కళ్లపెల్లి ప్రణయ్దీప్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగటిపూట దోమ.. ప్రాణాంతకమే..!
[ 16-05-2024]
ఈడెస్ రకానికి చెందిన ఆడదోమ ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. -
వనితే.. నిర్ణేత!
[ 16-05-2024]
ఒకప్పుడు మహిళలు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఎన్నికల్లో వారిదే పైచేయి అవుతోంది. -
నాణ్యత యంత్రాలు.. నమూనాకే పరిమితం
[ 16-05-2024]
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గతేడాది మిర్చి పంటకు ఊహించని రీతిలో ధరలు వచ్చాయి. -
పరకాలలో గరిష్ఠం.. పశ్చిమలో కనిష్ఠం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో 64.76శాతం ఓటింగ్ నమోదైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 59 పోలింగ్ కేంద్రాలు
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
పెరిగిన పోలింగ్ శాతం!
[ 16-05-2024]
జిల్లాలో జనగామ, స్టే.ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలున్నాయి. -
కస్తూర్బాల బాట పట్టేలా!
[ 16-05-2024]
అనాథలు, పేదరికంలో మగ్గుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్వహణ చేపడుతోంది. -
పల్లె ఓటెత్తింది.. పట్టణం పడకేసింది!
[ 16-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పల్లెల్లో ఓటాభిషేకం
[ 16-05-2024]
మహబూబాబాద్ లోక్సభ స్థానానికి జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది -
పల్లెల్లో ఓటోత్సాహం!
[ 16-05-2024]
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ములుగు శాసనసభ నియోజకవర్గంలో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంతమేర పెరిగింది. -
ప్రత్యక్షంగా వండేది లేదు.. దండుకునుడే!
[ 16-05-2024]
రైళ్లలో ఆహార పదార్థాల అమ్మకాలపై కొందరి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. -
అంగన్వాడీ టీచర్ దారుణ హత్య
[ 16-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో దారుణం జరిగింది. -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు. -
గ్రేటర్లో ఇంటి దొంగలు..!
[ 16-05-2024]
గ్రేటర్ వరంగల్లో ఇంటి దొంగల బెడద ఎక్కువైంది. కొందరు అధికారులు పెట్రోల్, డీజిల్ అప్పనంగా సొంత వాహనాలకు వాడుకుంటున్నారు.