తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు.
సమావేశంలో మాట్లాడుతున్న నీటి సరఫరా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి గోపి, చిత్రంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
కార్పొరేషన్, న్యూస్టుడే: వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. నీటి సరఫరాపై రోజువారీగా నివేదికలు పంపించాలని, మీ పరిధిలో కాకపోతే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుందన్నారు. నగరంలో తాగునీటి సరఫరా తీరు, వేసవి ప్రణాళిక, సమస్యలు తదితర అంశాలపై సోమవారం మధ్యాహ్నం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బల్దియా సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఎస్ఈ ప్రవీణ్చంద్ర నగరంలోని 66 డివిజన్ల వారీగా నీటి సరఫరా, ధర్మసాగర్ చెరువులో నీటినిల్వల వివరాలు తెలిపారు. ఎల్ఎండీ ద్వారా రా వాటర్ వస్తుందా?, ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు ఉన్నాయి, అద్దె వాటర్ ట్యాంకర్లు తదితర అంశాలపై ప్రత్యేకాధికారి గోపి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో అధికారులు, ఉద్యోగులకు సెలవులు లేవని, నీటి సరఫరాపై శ్రద్ధ పెట్టాలని, లీకేజీలు గంటల వ్యవధిలోనే అరికట్టేలా చూడాలన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. నీటి సరఫరాపై ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. 66 డివిజన్లకు ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. ఇంజినీర్లు కాలనీల్లో పర్యటించాలని సూచించారు. కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. నీటి సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, అప్రమత్తంగా ఉన్నామన్నారు. అనంతరం హనుమకొండ కేయూసీ ఫిల్టర్బెడ్ను ప్రత్యేకాధికారి గోపి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, పబ్లిక్హెల్త్ ఈఈ రాజ్కుమార్, బల్దియా ఈఈలు రాజయ్య, శ్రీనివాసరావు, శ్రీనివాస్, డీఈలు, ఏఈలు, లైన్మెన్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగటిపూట దోమ.. ప్రాణాంతకమే..!
[ 16-05-2024]
ఈడెస్ రకానికి చెందిన ఆడదోమ ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. -
వనితే.. నిర్ణేత!
[ 16-05-2024]
ఒకప్పుడు మహిళలు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఎన్నికల్లో వారిదే పైచేయి అవుతోంది. -
నాణ్యత యంత్రాలు.. నమూనాకే పరిమితం
[ 16-05-2024]
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గతేడాది మిర్చి పంటకు ఊహించని రీతిలో ధరలు వచ్చాయి. -
పరకాలలో గరిష్ఠం.. పశ్చిమలో కనిష్ఠం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో 64.76శాతం ఓటింగ్ నమోదైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 59 పోలింగ్ కేంద్రాలు
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
పెరిగిన పోలింగ్ శాతం!
[ 16-05-2024]
జిల్లాలో జనగామ, స్టే.ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలున్నాయి. -
కస్తూర్బాల బాట పట్టేలా!
[ 16-05-2024]
అనాథలు, పేదరికంలో మగ్గుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్వహణ చేపడుతోంది. -
పల్లె ఓటెత్తింది.. పట్టణం పడకేసింది!
[ 16-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పల్లెల్లో ఓటాభిషేకం
[ 16-05-2024]
మహబూబాబాద్ లోక్సభ స్థానానికి జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది -
పల్లెల్లో ఓటోత్సాహం!
[ 16-05-2024]
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ములుగు శాసనసభ నియోజకవర్గంలో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంతమేర పెరిగింది. -
ప్రత్యక్షంగా వండేది లేదు.. దండుకునుడే!
[ 16-05-2024]
రైళ్లలో ఆహార పదార్థాల అమ్మకాలపై కొందరి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. -
అంగన్వాడీ టీచర్ దారుణ హత్య
[ 16-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో దారుణం జరిగింది. -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు. -
గ్రేటర్లో ఇంటి దొంగలు..!
[ 16-05-2024]
గ్రేటర్ వరంగల్లో ఇంటి దొంగల బెడద ఎక్కువైంది. కొందరు అధికారులు పెట్రోల్, డీజిల్ అప్పనంగా సొంత వాహనాలకు వాడుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే