‘విద్యాకానుక’ సకాలంలో అందేనా?
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికల్లా విద్యార్థులందరికీ ‘విద్యాకానుక’ కిట్లు నూరు శాతం పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇంకా పూర్తిగా సరఫరా కాని పాఠ్యపుస్తకాలు
స్టాక్ పాయింట్లో భద్రపరిచిన పాఠ్యపుస్తకాలు
ఏలూరు విద్యా విభాగం, న్యూస్టుడే: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికల్లా విద్యార్థులందరికీ ‘విద్యాకానుక’ కిట్లు నూరు శాతం పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. బడుల ప్రారంభం రోజే 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ దిశగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా వస్తువులను ఆయా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దిగుమతి చేయలేకపోతున్నారు.
జిల్లాలో తొలుత నిఘంటువులను దిగుమతి చేశారు. ఆ తర్వాత ఇతర వస్తువుల దిగుమతి మందకొడిగా సాగింది. పలురకాల కారణాలతో కొన్ని రకాలకు జాప్యం ఏర్పడింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కొన్ని తరగతుల సిలబస్ మారడంతో పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. ఫలితంగా వాటి సరఫరాలో జాప్యం నెలకొంది. వర్క్ బుక్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు 71 శాతం, వర్క్ బుక్లు 66 శాతం దిగుమతయ్యాయి. మిగతావి ఒకటి రెండు రోజుల్లో రానున్నాయని సీఎంవో రవీంద్ర తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వివిధ రకాల వస్తువులను ఆయా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేసి భద్రపరుస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా స్కూలు పాయింట్లకు తరలిస్తున్నారు. గతంలో మండల పాయింట్ల నుంచి ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు తీసుకెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు నేరుగా పాఠశాలలకు పంపిస్తుండటం కొంత ఉపశమనం కలిగించే అంశం.
ట్రిపుల్ఐటీలో ప్రవేశానికి 14,256 దరఖాస్తులు
నూజివీడు న్యూస్టుడే: ఆర్జీయూకేటీ(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 14,256 దరఖాస్తులు అందినట్లు ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్ గోపాలరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ఓటుతో కొట్టు
[ 11-05-2024]
అధికార వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండి ప్రధాన కూడలిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
అయిదేళ్లూ.. ధరల దండయాత్ర
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాటు ధరల దండయాత్ర చేసింది. నిత్యావసరాలు మొదలు ఇంధనం, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. -
సైకో పోవాలి.. సైకిల్ రావాలి
[ 11-05-2024]
‘రైతుకు సాగు నీరు అందాలన్నా..గిట్టుబాటు ధర రావాలన్నా..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..పోలవరం పూర్తి కావాలన్నా..అమరావతి రాజధాని కావాలన్నా..నిత్యావసరాల ధరలు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలన్నా 13న మీరేం చేయాలి’ అంటూ ప్రజలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. -
మాటలు కోటలు.. జీతాల్లో కోతలు!
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వోద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలు అందకపోగా... ఇతరత్రా సౌకర్యాలను పొందలేకపోయారు. -
నోట్లకు.. ఓట్లు రాలతాయా?
[ 11-05-2024]
పోలింగ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ప్రచారాలతో పాటు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాదుడు
[ 11-05-2024]
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను భారీగా బాదేస్తున్నారు. -
మట్టి మాఫియా మళ్లీ బరితెగింపు
[ 11-05-2024]
అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో తలమునకలవుతోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా ఆచంట మండలం అనగార్లంక, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి సరిహద్దులో రెండు రోజులుగా విజృంభించింది. -
పోయేది జనం ప్రాణాలేగా?
[ 11-05-2024]
అనుకోని విపత్తులు విరుచుకు పడితే ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. వైకాపా సర్కారుకు మాత్రం ఇవేమీ పట్టవు. -
వైద్యం.. ఇదేం దౌర్భాగ్యం
[ 11-05-2024]
అధునాతన వైద్యసేవలను చేరువ చేస్తాం. భీమవరం వాసులకే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
నమ్మి ఓటేస్తే.. నయవంచన!
[ 11-05-2024]
రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత సాధారణ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని నిరుద్యోగ యువత మండిపడుతోంది. -
భీమవరంలో అమిత్షా పర్యటన రద్దు
[ 11-05-2024]
భీమవరంలో శనివారం జరగాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన రద్దయిందని భాజపా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అయిదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
[ 11-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం