Andhra news: గోదావరిలో దూకిన దంపతులు.. శవమై తేలిన నవ వధువు
నవ దంపతులు సిద్ధాంతం వంతెన పైనుంచి మంగళవారం గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త ఒడ్డుకు చేరుకోగా.. భార్య గల్లంతైన విషయం తెలిసిందే.
భర్త హత్య చేసి ఉంటాడని బంధువులు ఆందోళన
పెనుగొండ గ్రామీణ, పెనుగొండ, పోడూరు, న్యూస్టుడే: నవ దంపతులు సిద్ధాంతం వంతెన పైనుంచి మంగళవారం గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త ఒడ్డుకు చేరుకోగా.. భార్య గల్లంతైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి గాలిస్తుండగా గురువారం తెల్లవారుజామున జాలర్లకు సత్యవాణి(19) మృతదేహం దొరికింది. పెళ్లైన ఐదు రోజుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి మా అమ్మాయికి లేదని, భర్త హత్య చేసి ఉంటాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరరావు, ఏస్సై రమేష్ తదితరులు అక్కడికి చేరుకొని బంధువులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపితే నిజాలు తెలుస్తాయని, భర్త శివరామకృష్ణ తమ అదుపులోనే ఉన్నాడని తగిన న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తాత మెల్లు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని తణుకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ కె.రవి మనోహర చారి, పెనుగొండ తహసీల్దారు ఎన్.గురుమూర్తిరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంఘటనకు గల కారణాలపై నవ వధువు బంధువులను అడిగి తెలుసుకున్నారు.
సహకరించలేదనే..: రామారావు మనవరాలు సత్యవాణిని కైలా శివరామకృష్ణకు ఇచ్చి ఈ నెల 15న వివాహం చేశారు. మొదటి రోజు ఉండ్రాజవరం మండలం మోర్త, రెండో రోజు పెనుగొండ మండలం వడలిలో గడిపారు. నీవంటే నాకు ఇష్టం లేదంటూ వధువు దాంపత్యానికి సహకరించలేదని, దీంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని శివరామకృష్ణ పోలీసులకు వెల్లడించారు. శివరామకృష్ణ న్యాయవాది వద్ద లేఖరిగా ఉంటూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుతుంటాడు.
పలు అనుమానాలు..: ఇద్దరూ కలిసి బ్రిడ్జిపై నుంచి దూకినప్పుడు శివరామకృష్ణ కిలోమీటరు మేర సిద్ధాంతం వరకు ఎలా ఈదుతాడు, అతడిని కొందరు బయటకు తీసినచోట వధువు చెప్పులు ఉండటమేమిటి, శివరామకృష్ణతో ఇంకెవరైనా ఉన్నారా, బంగారు ఆభరణాలు ఏమయ్యాయి, ముందుగానే హత్య చేసి గోదావరిలోకి తోసేశాడా.. అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంస వేటు
[ 12-05-2024]
గోదావరి సవ్వళ్లు.. ప్రశాంతతకు మారుపేరైన పల్లెలు.. ఆత్మీయతకు రూపమైన పురాలు... ఉమ్మడి పశ్చిమ గోదావరి పేరెత్తగానే రాష్ట్రంలోని ప్రజల మదిలో మెదిలే భావాలివి.. కానీ, అయిదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో దాడులు పెరిగిపోయాయి. -
రాష్ట్రానికి జీవనాడి.. పథకాలు ఎడారి
[ 12-05-2024]
అపార జలవనరులు ఉన్న ఏలూరు జిల్లా రాష్ట్రానికి జీవనాడి అయ్యే అవకాశాలు ఉన్నా, వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. -
ముమ్మాటికీ.. జగనాసుర మార్గాలే!
[ 12-05-2024]
ఏ దేశంలోనైనా ప్రగతికి చిహ్నాలు మార్గాలే.. ఆర్థిక అభ్యున్నతికి ఊపిరినివ్వాల్సిన మార్గాలు జగన్ ఏలుబడిలో బలిపీఠమెక్కాయి. -
రైతుల కంట్లో కారం.. వైకాపా నేతలకు ‘సహకారం’
[ 12-05-2024]
అయిదేళ్ల వైకాపా సర్కారు పాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రజా సొమ్మును స్వాహా చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ నేతల కారణంగా అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. -
జగన్ వస్తే...జనం అల్లాడాల్సిందే!
[ 12-05-2024]
మండుటెండ..విపరీతమైన ఉక్కపోత...గంటల కొద్దీ నిరీక్షణతో శనివారం కైకలూరులోని సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు నరకయాతన అనుభవించారు. -
బాకాలూదుకోవడమే
[ 12-05-2024]
కైకలూరులో సీఎం జగన్ శనివారం నిర్వహించిన సిద్ధం సభలో ఆద్యంతం పథకాల గురించి ఊదరకొట్టారు. -
ఈ చట్టం మనకొద్దు
[ 12-05-2024]
వైకాపా సర్కారు తెచ్చిన భూహక్కు చట్టం ప్రతుల నకళ్లను నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పెద అమిరంలోని తన నివాసం వద్ద శనివారం సాయంత్రం దహనం చేసి నిరసన తెలిపారు. -
జగన్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు
[ 12-05-2024]
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయలేని సీఎం జగన్ అయిదేళ్లలో 12 సార్లు ఛార్జీలు పెంచి చీకట్లు మిగిల్చారని వైకాపాకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్లీన్ స్వీప్ చేయబోతున్నాం
[ 12-05-2024]
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ అన్నారు. -
ఓట్ల వేటకు కోట్లు గుమ్మరింపు!
[ 12-05-2024]
ప్రస్తుత ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లపై నోట్ల వాన కురుస్తోంది. -
ఊరు రమ్మంది.. ఓటేయమంది!
[ 12-05-2024]
ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వేలాది మంది ఓటు వేసేందుకు స్వస్థలాలకు భారీగా తరలి వస్తున్నారు. -
వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 12-05-2024]
‘హలో.. మేము తహసీల్దారు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తణుకులో ఆదివారం నుంచి ఎన్నికల విధులు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు