logo

గ్రంధి ఏనాడైనా పవన్‌లా సేవ చేశారా?

ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మెగా బ్రదర్స్‌పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు

Published : 23 Apr 2024 06:21 IST

జనసేన నాయకుడు రామమోహనరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మెగా బ్రదర్స్‌పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను రాజకీయ వ్యాపారవేత్త అని విమర్శించిన శ్రీనివాస్‌ ఏనాడైనా ఆయనలా పేదలకు సహాయం చేశారా అని సోమవారం ప్రశ్నించారు. ‘భీమవరంలో కనిపించిన స్థలాలన్నీ కబ్జాచేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన భూబకాసురుడు గ్రంధి. ఈ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేసిన చిరంజీవి సేవలను ఎవరూ మర్చిపోరు. ఆయన చేసిన మేలును రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి తెలుసు. కొవిడ్‌ సమయంలో మెగా బ్రదర్స్‌ సేవ చేస్తుంటే వైకాపా మాత్రం ప్రజలను దోచుకుంది’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని