వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు.
పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఆస్తుల విలువ ఎంత అనేది లెక్కలు తీస్తే తెలుస్తుందన్నారు. ఏ వ్యాపారం చేసినా కూడగట్టలేనన్ని ఆస్తులు రాజకీయాల్లో అవినీతి చేసి సంపాదించవచ్చని చెప్పడానికి వైకాపా కుటుంబమే సాక్ష్యంగా కనబడుతుందన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక అడ్డదారుల్లో జగన్మోహన్రెడ్డి రూ.లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. అప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని సంపాదిస్తే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగా తనే అవినీతికి పాల్పడ్డాడనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు.మరోసారి జగన్ను గెలిపిస్తే మీ భూముల పట్టాదారు పాసుపుస్తకాలు పోయి జిరాక్స్ కాపీలు వస్తాయని, దీన్ని ఓటర్లు గుర్తుంచుకొని సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!