YSRCP: ఎమ్మెల్యే X సర్పంచి
మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్బాషాకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటు మదనపల్లె పురపాలక సంఘంలో, అటు గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులు ఆయన తీరును విమర్శిస్తూనే ఉన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో వాగ్వాదం
అధికార పార్టీలో బయటపడిన విభేదాలు
ఎమ్మెల్యే నవాజ్బాషా ఎదుట సర్పంచి బుడ్డయ్య
(వృత్తంలో ఉన్న వ్యక్తి)తో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు
మదనపల్లె గ్రామీణ, న్యూస్టుడే: మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్బాషాకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటు మదనపల్లె పురపాలక సంఘంలో, అటు గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులు ఆయన తీరును విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లెలో శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, సర్పంచి బుడ్డయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దుబ్బిగానిపల్లెలో సర్పంచి బుడ్డయ్య అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. చివరగా ఎమ్మెల్యే నవాజ్బాషా మాట్లాడుతుండగా సర్పంచి లేచి తాను మాట్లాడతానని చెప్పారు. ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ ‘తొలుత మైకు ఇచ్చాం కదా... గొడవ పెట్టుకునేందుకు వచ్చావా..? ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ మండిపడ్డారు. నేనెందుకు వెళ్తాను, ఇది నా పంచాయతీ నీవే ఇక్కడి నుంచి వెళ్లిపోమని సర్పంచి ఎదురు సమాధానం చెప్పడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే అనుచరులు జోక్యం చేసుకుని సర్పంచిపై వాగ్వాదానికి దిగడంతో ఇరువురిని గ్రామస్థులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ సత్యనారాయణ, పోలీసులు అక్కడికి చేరుకుని సర్పంచిని అక్కడి నుంచి పంచాయతీ సచివాలయంలోనికి తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడం, అంతర్గత విభేదాలు బహిర్గతం కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయితీపై పచ్చి రొట్ట ఎరువులు పంపిణీకి సిద్ధం
[ 16-05-2024]
మండలానికి 40 క్వింటాళ్ల జీలుగలు, 5 క్వింటాళ్ల జనుములు, 4 క్వింటాళ్ల పిల్లిపెసర్లు 50 శాతం రాయితీపై మంజూరయ్యాయని మండల వ్యవసాయ అధికారి జాకీర్ షరీఫ్ తెలిపారు. -
ఓట్ల పండగలో వైకాపా అరాచకం!
[ 16-05-2024]
ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా అరాచకాలు సాగించిన వైకాపా సార్వత్రిక ఎన్నికల్లోనూ విధ్వంసకాండను కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా హింసకు పాల్పడింది. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లతో భయాందోళనకు గురిచేసింది. -
సగమే వస్తోంది జలం... సర్దుకోవాల్సిందే జనం
[ 16-05-2024]
జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణాన్ని తాగునీటి ఎద్దడి ముప్పు వెంటాడుతోంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా నీరు అందించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
[ 16-05-2024]
మండల పరిధి తరిగొండ పంచాయతీలోని రామానాయుడు చెరువులో బుధవారం కొందరు అక్రమార్కులు యంత్రాల సాయంతో ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు -
ఐదేళ్లకొకసారి అవకాశం.. చేజార్చుకున్నారు వజ్రాయుధం..!
[ 16-05-2024]
జిల్లాలో 14,26,834 మంది ఓటర్లు ఉండగా వీరిలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 3,16,003 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. -
జమ్మలమడుగులో హై అలర్ట్
[ 16-05-2024]
జమ్మలమడుగులో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. -
అసంపూర్తి పనులతో అవస్థలు
[ 16-05-2024]
కడప నగరంలోని మాసాపేట నుంచి దేవుని కడపకు వెళ్లే మార్గంలో చేపట్టిన భూగర్భ మురుగు కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి -
కడపలో దాహం కేకలు
[ 16-05-2024]
కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఓటేయనివారు 3,38,681 మంది..
[ 16-05-2024]
జిల్లాలో 16,39,066 మంది ఓటర్లు ఉండగా వీరిలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 3,38,681 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. -
క్లాప్... ఫ్లాప్!
[ 16-05-2024]
‘గ్రామీణ భారతావనిలో పరిశుభ్రత వాతావరణం కల్పించాలి. జనావాసాల ముంగిట్లో, వీధులు, రహదారుల పక్కన ఎక్కడా కూడా చెత్త కుప్పలు కనిపించరాదు. -
బాధితులకు పరామర్శ
[ 16-05-2024]
వైకాపా అల్లరి మూకల రాళ్లదాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలకు తాము, పార్టీ అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు -
కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్టు
[ 16-05-2024]
పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో ఈ నెల 11న కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన కేసులో తండ్రి కుండ సురేష్ను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చాంద్బాషా బుధవారం తెలిపారు. -
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉపేక్షించం
[ 16-05-2024]
తెదేపాలో ఉంటూ, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కమలాపురం తెదేపా అభ్యర్థి పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ