logo

కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్‌డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 23 Apr 2024 05:22 IST

మైలవరంలో పార్టీలో చేరిన వారితో ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్‌డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గంలోని మండలాల్లో విస్తృంగా చేరికలు, ప్రచారాలు, ర్యాలీలు జరిగాయి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడేతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించాలని కోరారు. జగన్‌ దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే ముస్లిం సోదరులకు ప్రత్యేక పథకాలు అమలయ్యాయన్నారు. వైకాపా ప్రభుత్వం రంజాన్‌ తోఫా, దుల్హన్‌ లాంటి పథకాలను రద్దుచేసిందన్నారు.      

న్యూస్‌టుడే, క్లస్టరు బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని