క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం
ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.
అయిదేళ్లయినా ఊసే లేని క్రీడా హబ్ హమీ
ఆవేదనలో యువకులు, సందర్శకులు, విద్యార్థులు
అనిబిసెంట్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్మించిన తాత్కాలిక మార్కెట్
న్యూస్టుడే, ప్రొద్దుటూరు: ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది. దీనికంతంటికీ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డినే ప్రధాన కారణమని రోజు గ్రౌండ్కొచ్చే వేయి మంది క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్సు, సందర్శకులు అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే క్రీడా మైదానాన్ని క్రీడా హబ్గా మారుస్తానని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే విస్మరించడమే కాకుండా ఉన్న బడిని గ్రౌండ్ను తనకు ఆదాయం సమకూరేలా తాత్కాలిక కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు. శివాలయం కూడలి వద్ద ఉన మార్కెట్ శిథిలావస్థకు చేరగా, దౌర్జన్యంగా కూల్చివేయించారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి సర్వేనెంబర్ 361లో 4.40 ఎకరాల్లో ఉన్న క్రీడా మైదానాన్ని ఎంపిక చేసుకున్నారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో, కూల్చేసిన మార్కెట్ స్థలంలో ఏడాదిలోపు కొత్తగా నిర్మిస్తామన్నారు. ఆపై క్రీడా మైదానం యథావిధిగా పాఠశాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లవుతున్నా గ్రౌండ్లో క్రీడాభివృద్ధి కోసం ఒక్క ఫైసా అభివృద్ధి పనులు చేపట్టకపోగా ఏడాది లోపల తాత్కాలిక మార్కెట్ను తొలగిస్తామన్నా హామీ నెరవేరలేదు. క్రీడల్లో నైపుణ్యత పొందేందుకు సాధన చేసుకోవడానికి ఉన్న గ్రౌండ్ ఏ మాత్రం సరిపోలేదని, తొందరగా కూరగాయల మార్కెట్ను తొలగించి యథావిధిగా గ్రౌండ్ను అప్పగించి, అభివృద్ధి చేయాలని పుర ప్రజలు కోరుతున్నారు.
క్రికెట్ పిచ్ చెదిరిపోయింది
-శివ రాయల్, అండర్-19 క్రికెటర్, ప్రొద్దుటూరు.
తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటుతో క్రికెట్ పిచ్ పాడైంది. ఆ పిచ్పై ప్రతి ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడి, ఆటను మెరుగుపరచుకునేవాడిని. గత మూడేళ్లుగా క్రిక్ట్ సాధన చేసేందుకు గ్రౌండ్ అనుకూలంగా లేదు. దాంతో రాష్ట్ర అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపికకాలేకపోయాను.
ఫుట్బాల్ శిక్షణ ఆపేశాం
-హఫీజ్, ఫుట్బాల్ క్రీడా కోచ్, ప్రొద్దుటూరు
ప్రతి ఏటా ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించి, ఎంతో మంది పిల్లలు క్రీడాకారులుగా తయారయ్యేవారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలకెళ్లేవారు. మార్కెట్ నిర్మించడంతో గ్రౌండ్ కాస్త చిన్నదైంది. దాంతో సాధన చేయించలేకపోతున్నాం.
రన్నింగ్ ట్రాక్ పాడైంది
-హేమశ్రీ తైక్వాండో రాష్ట్ర క్రీడాకారిణి, ప్రొద్దుటూరు
అనిబిసెంట్ క్రీడా మైదానం చాలా విశాలంగా ఉండేది. రన్నింగ్ ట్రాక్ లైన్ ఉండేది. మార్కెట్ నిర్మాణం కారణంగా ట్రాక్ లైన్ పోయింది. దాంతో పరుగు సాధన చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
ఆహ్లాదాన్ని పంచేది
-చెన్నయ్య, క్రీడాకారుడు, దేవగుడి
పరుగు, హైజంపు, లాంగ్జంపు, వాలీబాల్, సాఫ్ట్బాల్ క్రీడల సాధన కోసం దేవగుడి నుంచి ప్రొద్దుటూరు అనిబిసెంటు గ్రౌండ్కు వచ్చేవాడిని. ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో అండర్-14, 17, 19 ఎస్జీఎఫ్ఐ అథ్లెటిక్స్ పోటీల్లో నెగ్గేవాడిని. మార్కెట్ నిర్మించడంతో క్రీడా మైదానం చిన్నదైపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడితో జనం బలి... ఓటుతో వేటేస్తేనే దీపావళి
[ 12-05-2024]
జగనాసురుడి ఏలుబడి... ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూడని పెను విధ్వంసాన్ని స్పష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల జీవిత చక్రాన్ని వైకాపా ప్రభుత్వం ఛిద్రం చేసింది. -
అక్రమాల్లో బాద్షా
[ 12-05-2024]
‘ఎక్కడెక్కడి నేతలో లెక్కలేనన్ని అక్రమాలు చేస్తుంటే.. జగన్ సొంత జిల్లా, అందులోనూ జిల్లా కేంద్రం ప్రజాప్రతినిధిని.. పైపెచ్చు సీఎం తర్వాత సీఎం అంతటి హోదా కాబట్టి వారికంటే ఒక మెట్టు పైనే ఉండాలి’ అని అనుకున్నారో ఏమో.. కడపలో ఆయన చేయని దౌర్జన్యం లేదు. -
చేసింది శూన్యం... దోచింది అనంతరం
[ 12-05-2024]
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యం కానీ దోచింది మాత్రం అనంతం... గుట్టను, మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వుకోవడంతో పాటు భూకబ్జాలు, దౌర్జన్యాలు, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి అక్రమాలతో అలజడులు సృష్టించారు. -
కాంగ్రెస్ సహకారంతోనే కడప ఉక్కు సాకారం
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కడప నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. -
తెదేపాలో చేరికలు... జోరుగా ప్రచారాలు
[ 12-05-2024]
భారీగా జరిగాయి. శనివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లో ఎన్డీఏ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. -
దొంగనోట్లు పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నారు జాగ్రత్త : వరద
[ 12-05-2024]
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి మోసగాడని, ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది’
[ 12-05-2024]
తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన లాగే పాలిస్తారని అనుకున్నాం. -
వైకాపా ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేసిందని ఓటేయాలి?
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం మైనారిటీల కోసం ఏం చేసిందని ఆ పార్టీ నాయకులకు ఓటేయాలని తెదేపా పట్టణాధ్యక్షుడు జబీవుల్లా ప్రశ్నించారు. -
కోదండరాముడి అభిషేకం
[ 12-05-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. -
రాచమల్లు అరాచకాలపై వరద కరపత్రం విడుదల
[ 12-05-2024]
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెదేపా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి శనివారం ‘ధుర్యోదన నీ చేష్టలు నీచాతినీచం’ పేరుతో కరపత్రం విడుదల చేశారు -
ఆదినారాయణరెడ్డి ప్రగతిపై కరపత్రం చక్కర్లు
[ 12-05-2024]
జమ్మలమడుగు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి’ పేరిట ఒక కరపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ