జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు.
కేంద్ర, రాష్ట్ర నిధుల మళ్లింపు
ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు
పంచాయతీరాజ్ ఛాంబరు, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గత నెలలో ‘నిధులు-విధులు’ కోసం సర్పంచుల నిరసన
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబరు, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ‘నిధులు-విధులు’ కోసం సర్పంచులు అనేక సార్లు పోరాటాలు చేసినప్పటికీ జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించుకుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగక కునారిల్లుతున్నాయి.
న్యూస్టుడే, కడప ఏడురోడ్లు: ప్రస్తుత మండు వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ట్యాంకర్లలో సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు. వడగాలులు వీస్తుండడంతో విద్యుత్తు దీపాలు పాడవుతున్నాయి. వాటి మరమ్మతులకూ దిక్కులేదు. హరిత రాయబారులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు రావడం లేదు. దీంతో చాలా గ్రామాల్లో చెత్త నిల్వలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలు తున్నాయి. మురుగు కాలువల్లో పూడికలూ తీయలేకపోతున్నారు. ఇలా చిన్నచిన్న పనులు సైతం చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.830 కోట్లకు పైగా బకాయిలు
ఉమ్మడి కడప జిల్లాలో 807 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాల కింద సుమారు రూ.600 కోట్లకు పైగా విడుదల చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. మరోవైపు 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా ఏటా జిల్లాకు సుమారు రూ.46 కోట్ల వరకు విడుదల చేయాలి. ఈ అయిదేళ్లలో రూ.230 కోట్లు రావాలి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి మొత్తం రూ.830 కోట్లకు పైగా నిధులు గ్రామపంచాయతీలకు జమ కాలేదు. ఇదిలాగుంటే వారం రోజుల కిందట రూ.988 కోట్ల నిధులను రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అవి ఇప్పటికీ జమ కాలేదు. మొత్తం మీద ఐదేళ్ల జగన్ పాలనలో పంచాయతీల ఖజానా ఖాళీ చేసేసి కోలుకోలేని దెబ్బ తీశారు.
ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులకు ఎటువంటి అధికారాలివ్వకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. జడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు, సర్పంచులకు రావాల్సిన గౌరవ వేతనం కొన్ని నెలలుగా విడుదల చేయలేదు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
కొత్తపు మునిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పంచాయతీరాజ్ ఛాంబరు
అభివృద్ధికి దూరంగా పల్లెలు
జగన్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. పంచాయతీలకు వస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడింది. తాగునీటి అవసరాలు, విద్యుత్తు దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఇలా... ఏ పనులూ చేయలేకపోతున్నాం.
పార్థసారథిరెడ్డి, సర్పంచి, పులికుంట్ల, గాలివీడు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం!
[ 15-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
తెదేపా యువకులపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయొద్దని అడ్డుకున్నందుకు తెదేపా సానుభూతిపరులైన యువకులపై వైకాపా నాయకులు దాడులకు తెగబడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
వైకాపా నాయకుల ప్రలోభాలను తిప్పికొట్టాం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను వైకాపా నాయకులు ప్రలోభాలకు గురి చేశారని తెదేపా పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి బీటెక్ రవి ఆరోపించారు. -
అంతా రహస్యం!
[ 15-05-2024]
గుత్తేదారుల పరుగులు.... అందులోనూ వైకాపా కీలక నేతల అనుయాయుల్లో కదలికలు... ఇంజినీరింగ్ విభాగాల్లో గుసగుసలు... రహస్యంగా కదులుతున్న ఫైళ్లు... పెండింగ్ బిల్లుల అప్లోడింగ్... వరుస క్రమంలో కాకుండా అడ్డమార్గాల్లో బిల్లుల చెల్లింపులు.. -
చెప్పినట్లే చేశారు!
[ 15-05-2024]
ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే తాటతీస్తాం. పరిస్థితిని బట్టి అలాంటి వారిని తరిమితరిమి కొడతాం. ఈవీఎంలను ఎవరినీ తాకనీయం. తాకితే వారికి మూడినట్లే.. అల్లర్లకు పాల్పడినా, హింసకు పాల్పడినా నిందితులను జిల్లా బహిష్కరణ చేస్తాం. -
వైభవంగా త్రిశూల చక్రస్నానం
[ 15-05-2024]
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం త్రిశూల చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రాధిపతి వైద్యనాథేశ్వరస్వామిని కామాక్షి అమ్మవారితో సహా పినాకినీ నదీతీరానికి తీసుకురాగా, -
అంజాద్బాషాకు ప్రజలే తగినశాస్తి చేస్తారు
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రంలోకి ఏ మగాడు వస్తాడో చూస్తాను అంటూ డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారని... ఆయన మగతనం రోడ్ల జంక్షన్లో చూపించుకోవాలని, -
అండగా ఉంటా...
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వెళ్లి ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చిన్నయ్యకు అండగా ఉంటానని మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
[ 15-05-2024]
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఇటుక పెళ్లతో దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
సార్వత్రిక సమరం... కొనసాగిన పురుషాధిక్యం
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. మార్చి 16న ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పట్నుంచి రాజకీయ నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదునుపెట్టారు. ఏప్రిల్ 18న నామినేషన్ల ఘట్టంతోనే ఎన్నికల ప్రచారానికి తెరలేచింది. -
మాదిగలు ఏజెంట్లుగా కూర్చోకూడదా?
[ 15-05-2024]
మాదిగలు ఏజెంటుగా కూర్చునే హక్కు లేదా అని ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, కె.ఎన్.రాజు ప్రశ్నించారు. కడప ప్రెస్క్లబ్లో మంగళవారం వారు మాట్లాడుతూ -
రాళ్లదాడి ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు...కేసు నమోదు
[ 15-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప రెండో పట్టణ ఠాణా పరిధిలోని గౌస్నగర్లో సోమవారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఇరువర్గాలు మంగళవారం సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు చేశారు.