మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నగరంలో బరిలో నిలిచిన అధికార పార్టీకి చెందిన నేత తాయితాల పంపిణీకి తెరలేపారు. ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నగరంలో పలు వర్గాలను స్వయంగా ఇంటికి పిలిచి నగదు రూపంలో పంపిణీ చేస్తున్నారు. దీన్ని కొందరు వ్యతిరేకించి ఆయన ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. ఇన్నాళ్లూ ఏం చేయలేని ప్రభుత్వం, నాయకులు ఇప్పుడు డబ్బులు ఆశ చూపితే ఎలా వస్తామంటూ పలువురు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
కులాలు, వర్గాలవారీగా..
కులాలు, వర్గాల వారీగా ఇంటికి పిలిపించి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు, ఒప్పంద ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జాబితాను సిద్ధం చేశారు. వారందరికీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి కార్యాలయానికి రప్పించి రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకూ పంపిణీ చేస్తున్నారు. నగరంలో ఆయా డివిజన్లలో ద్వితీయ శ్రేణి నాయకులకూ బేేరాలు పెడుతున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ఛోటా నాయకులను గుర్తించి నేత వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలి.
మేము రాం..
ఇన్నాళ్లూ తమ సమస్యలు పట్టించుకోకపోగా.. ఇప్పుడు పిలిస్తే ఎలా వస్తామా అంటూ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బందిని రావాల్సిందిగా సంబంధిత నాయకుడి కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితం సమాచారం అందించారు. అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. అంగన్వాడీల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వారంతా డబ్బులకు ఆశపడి వచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కోవలో మరికొన్ని కార్మిక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో విస్మయం చెందిన నేతలు ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశచూపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వెళ్లేదిలేదని వారంతా నాయకుల ముఖం మీదే చెప్పేస్తున్నారు.
ఇంటివద్ద యథేచ్ఛగా పంపిణీ
నగరంలోని అధికార పార్టీ నేత ఇంటి వద్ద రెండు రోజులుగా హడావుడి కనిపిస్తోంది. ప్రతీ రోజు రాత్రి సమయంలో ఆయా వర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో గెలుపునకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నగరంలో పలు వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకొన్న అధికార పార్టీ నేత.. ఇప్పుడు సొమ్ములు ఆశ చూపుతున్నారు. ఎన్నికల కోడ్ రాక ముందు నగరంలో సామాజిక భవనాల పేరుతో ప్రభుత్వ స్థలాలను పంచిపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో సొమ్ములు ఆశ చూపి ఓట్లు రాబట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
-
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం