అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకాలం ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారు
నిలదీసిన రాజధాని మహిళలు, రైతులు
తుళ్లూరు, న్యూస్టుడే: ‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు బుధవారం 1597వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అనంతవరంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మీడియాతో మాట్లాడడం చేతకాక జగన్ దొంగచాటుగా జాతీయ మీడియాలో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి మేటి రాజధాని ఉండాలని చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభిస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు ముక్కలాటతో నాశనం చేశారన్నారు. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదు.. అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని జాతీయ మీడియా ప్రతినిధి అడిగితే జగన్ అమరావతిని చులకన చేస్తూ వికృతంగా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అమరావతిని గుంటూరు, విజయవాడ నగరాలకు దూరంగా పనికిరాని భూమిలో ఎలా కడతారు అని జగన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సచివాలయం, శాసనసభ ఎక్కడ ఉన్నాయో.. ఆయన ఐదేళ్లు ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారో అవగాహన లేదా అని నిలదీశారు. హైటెక్ సిటీ కూడా ఒకప్పుడు కొండలు, గుట్టలుగానే ఉండేదని, కానీ దూరదృష్టితో చంద్రబాబు దాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేశారన్నారు. మూడు పంటల పండే బంగారు భూమిని రాజధాని కోసం త్యాగం చేస్తే..జగన్ అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాత్రి 7 గంటలైనా పగటి వెలుగులే
[ 01-06-2024]
రోహిణి కార్తెలో రోళ్లు బద్దలవుతాయనేది నానుడి. అందుకు అనుగుణంగానే ఎండలు మండిపోతున్నాయి. గత మూడురోజులుగా 44, 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి భగభగలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తొలి ఫలితం తాడికొండదే!
[ 01-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న గుంటూరు లోక్సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తొలుత వెల్లడి కానుంది. మంగళగిరి ఫలితం చివరిలో రానుంది. -
పార్టీ గెలిస్తేనే పంటల సాగు
[ 01-06-2024]
జూన్ ప్రారంభంతో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. పల్నాడు జిల్లాలో ఇప్పటికే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పాటికే పొలాలు శుభ్రం చేసి దుక్కులు దున్ని విత్తనాలు నాటడానికి సిద్ధం చేయాలి. -
‘వైకాపా ఓడిపోవడం ఖాయం’
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఓడిపోతుందని అధికార పార్టీ నాయకులే బాహాటకంగా చెబుతున్నారని రాజధాని రైతులు పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని వైకాపా నాయకులే బెట్టింగ్లు కాస్తున్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడమే దానికి నిదర్శనమని చెప్పారు. -
మళ్లీ పెంచేశారు
[ 01-06-2024]
ప£త్తి రైతులకు చేదు వార్త. బీటీ పత్తి విత్తనాల ధర ఈఏడాది కూడా పెరిగింది. వరుసగా నాలుగో సంవత్సరం సైతం విత్తనాల ధరలను పెంచడం గమనార్హం. గిట్టుబాటు ధరలు దక్కక, తెగుళ్లు, వాతావరణ సమస్యలతో దిగుబడులు తగ్గిపోయి నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో ధరలు పెంచడం రైతులకు మింగుడుపడడం లేదు. -
కోడ్ ఉన్న.. వారు చెప్పిందే చేస్తాం
[ 01-06-2024]
నగరంలో అసంపూర్తి పనులు పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం వైకాపా నేతల సిఫార్సులకు తలొగ్గి కొత్త పనులను మాత్రం రాత్రికి రాత్రే చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు చేయకూడదు. -
హనుమజ్జయంతి ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు
[ 01-06-2024]
దేవాదాయశాఖకు చెందిన నాజ్కూడలిలోని ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జయంతికి ముందు రోజు గ్రామోత్సవం నిర్వహించేందుకు ఆలయ ఈవో, సహాయకమిషనర్ డి.శ్రీనివాసరావు ముందస్తుగా పోలీసులకు అనుమతులు తీసుకున్నారు. -
ఆర్టీసీ బస్సు, క్రేన్ ఢీ: ఇద్దరికి గాయాలు
[ 01-06-2024]
అది తెనాలి బాలాజీరావుపేట-బస్టాండ్ రోడ్డు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయం. జనం రాకపోకలు సాధారణంగా సాగుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు, భారీ క్రేన్ ఢీ కొని వెలువడిన పెద్ద శబ్దం, ప్రమాద తీవ్రతను చూసిన జనం ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. -
మారువేషంలో విత్తన దుకాణాల్లో తనిఖీలు
[ 01-06-2024]
నగరంలోని విత్తన విక్రయ దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రాజాగారితోటలోని పలు దుకాణాల్లో పత్తి, మిర్చి విత్తనాలు అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ ఈశ్వరరావు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశారు. -
భార్యను కత్తితో పొడిచిన భర్త
[ 01-06-2024]
భార్యను భర్త కత్తితో పొడిచిన ఘటన తెనాలి పట్టణ కొత్తపేటలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... చుండూరు మండలం వలివేరుకు చెందిన మానస, ఆమె మేనమామ కొల్లూరు వాసి రవిలకు సుమారు 7 సంవత్సరాల కిందట వివాహం అయ్యింది. -
నాలుగు రోజులు దుకాణాల బంద్
[ 01-06-2024]
ఎన్నికల లెక్కింపు తేదీ సమీపిస్తుండడంతో జిల్లాలో 144 సెక్షన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఈనెల 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు స్వచ్ఛందంగా మూసేసి సహకరించాలని పోలీసులు మైక్ ప్రచారం చేస్తున్నారు. -
మొదటి ఫలితం చిలకలూరిపేట.. చివరగా గురజాల
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు పక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం మరికొద్దిరోజుల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. -
తొలి ఫలితం బాపట్ల.. చివరగా అద్దంకి
[ 01-06-2024]
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4వ తేదీ పైనే అందరి చూపు ఉంది. మరో అయిదు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, బాపట్ల లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
బడ్డీ కొట్టు తీసేయ్
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపాకు ఓటు వేయలేదనే కోపంతో చిరు వ్యాపారాన్ని తొలగించాలంటూ స్థానిక నేతలు ఓ మహిళపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ ఒంటరి మహిళ దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. -
పనులు పూర్తి చేస్తారా.. సొమ్ము తిరిగి ఇచ్చేస్తారా!
[ 01-06-2024]
గుంటూరు జిల్లా మేడికొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిధులు ఎక్కువగా ఉన్నాయని వాటిని సమీపంలోని కొర్రపాడు, తురకపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు, సిరిపురం ప్రాథమిక పాఠశాలకు సర్దుబాటు చేశారు. -
ప్రమాద బాధితులు.. ప్రాణాలు అరచేతుల్లోనే!
[ 01-06-2024]
చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. రోడ్డు ప్రమాద బాధితులు వస్తే ఒంగోలు, గుంటూరు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆర్థిక భారమైనా ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిలేరు మీకెవ్వరు.. సగర్వంగా పదవీ విరమణ చేసిన ఏబీవీ
-
కౌంట్డౌన్.. 4వ తేదీ ఖాళీల్లేవ్..!
-
రైలుబండి రద్దవుతోంది.. వేసవిలో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
-
పోలీసుల ‘అధికార పక్ష’పాతం.. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా బైండోవర్లు
-
సార్వత్రిక సమరం.. తుది విడత పోలింగ్ ప్రారంభం
-
పదేళ్ల ప్రగతి.. విశ్వనగర ఖ్యాతి