మండుటెండల్లో.. ఠండా పానీ
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది.
పలు ప్రాంతాల్లో జలమండలి ఉచిత తాగునీటి కేంద్రాలు
నాచారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం
ఈనాడు, హైదరాబాద్: చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. మట్టికుండల స్థానంలో పెద్ద సైజు కూలింగ్ ఫిల్టర్లను పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. కొన్ని చోట్ల క్యాన్లతో చల్లని నీటిని సరఫరా చేస్తోంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. గతంలో మట్టికుండలు లేదా ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టి నీళ్లు పోసేవారు. ప్లాస్టిక్ గ్లాసుతో అడిగిన వారికి నీటిని అందించేవారు. పరిసరాల శుభ్రత పాటించకపోవడం, డ్రమ్ములను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో ఈ నీటిని తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. ఈ వేసవిలో జలమండలి అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే పెద్దపెద్ద కూలింగ్ ఫిల్టర్లను అందుబాటులో ఉంచారు. వీటిలో నీళ్లు పోస్తే....ఫిల్టర్తో కూల్ అయి బయటకు సరఫరా అవుతాయి. అక్కడే డిస్పోజబుల్ గ్లాసులు ఉంచారు. కొన్ని చోట్ల చిన్న చిన్న క్యాన్లలో శుభ్రమైన చల్లటి నీటిని పోసి ప్రజలకు అందిస్తున్నారు. మండుటెండల్లో దాహం వేసి నీళ్ల కోసం చూసే వారికి ఈ కేంద్రాలు ఊరటనిస్తున్నాయి. రూ.20 పెట్టి చల్లని వాటర్ బాటిల్ కొనే కంటే ఈ నీటినే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు బల్డియా పరిధిలో 55, అవుటర్ రింగ్ పరిధిలో మరో 70 ఈ వినూత్న చలివేంద్రాలను జలమండలి ఏర్పాటు చేసింది. బస్టాప్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో నెలకొల్పుతున్నారు. కూలీ పనులు చేసుకునే వారు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై తోపుడు బళ్లపై వ్యాపారం చేసేవారు ఎండాకాలంలో చల్లటి తాగునీరు లేక విలవిలలాడుతుంటారు. ఇలాంటి వారు ఈ కేంద్రాల ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు.
ఇక అక్కడ అన్ని రోజుల్లో కొనసాగింపు
సూటేసుకుని టిప్టాప్గా రెడీ అయి తాగునీరు అందిస్తున్న ఇతడు బంజారాహిల్స్లోని ‘తాజ్కృష్ణ’ ఉద్యోగి. హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఇలా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జలమండలి ప్రత్యేకంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మిగతా రోజుల్లో ప్రజల నుంచి పెద్దగా డిమాండ్ ఉండకపోవడంతో మూసేస్తుంది. ఇక నుంచి కీలక ప్రాంతాల్లో ఈ కియోస్కోలను కొనసాగించనుంది. రద్దీగా ఉండే కొన్ని ప్రభుత్వ, ట్రస్టు ఆసుపత్రులు, బస్టాండ్ల వద్ద నిరంతరం ఈ కేంద్రాలను కొనసాగించాలని నిర్ణయించింది. బస్టాప్ల వద్ద ప్రయాణికులకు, ఆసుపత్రుల వద్ద రోగులు, సహాయకులకు మంచినీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో చాలా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇలాంటి వారికి జలమండలే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనుంది. చలివేంద్రాలకు బల్క్గా తాగునీరు అవసరమయ్యే వారు 155313 ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
-
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం