ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
‘ఓట్ ఫర్ ష్యూర్’ మెహందీ చూపుతున్న కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
అవగాహన కల్పించండి
కరీంనగర్ సంక్షేమ విభాగం: మండల సమాఖ్య సభ్యురాళ్లు గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలోని స్వశక్తి కళాశాలలో జిల్లా సమాఖ్య సభ్యురాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం ట్రాన్స్జెండర్లకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓ ట్రాన్స్జెండర్ కలెక్టర్ పమేలా సత్పతి చేతిపై స్వీప్, ఓట్ ఫర్ షూర్ అని రాయగా.. మెహందీని చూపుతూ కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, శిక్షణా కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ గ్రామీణం: ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జూపాకలో హోం ఓటింగ్లో భాగంగా వృద్ధ అంధురాలు కనకలక్ష్మితో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఇంటి వద్ద ఓటు అనే పద్ధతిని ప్రవేశపెట్టిందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
[ 01-06-2024]
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
మది నిండుగ.. దశాబ్ది పండుగ!
[ 01-06-2024]
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయింది.. ఆదివారం పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబవుతోంది. ఇన్నేళ్ల ఘన కీర్తిని.. ఉద్యమ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తు దిశగా పడే అడుగులపై ఉమ్మడి జిల్లావాసుల్లో ఆశలు పెరుగుతున్నాయి.. -
కాషాయ వర్ణం.. కొండగట్టు
[ 01-06-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు కాషాయ శోభను సంతరించుకుంటున్నాయి. వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదాలకు వస్త్రాలు చుట్టుకుని, హనుమాన్ జెండాను చేతపట్టుకుని పాదయాత్రగా ‘రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ’ అంటూ ఘాట్రోడ్డు, మెట్లదారిన కొండపైకి చేరుకున్నారు. -
116 టేబుళ్లు.. 153 రౌండ్లు
[ 01-06-2024]
కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఈనెల 4న ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
ఉత్తమ ఫలితాలు.. మౌలిక వసతులు
[ 01-06-2024]
పక్కా భవనాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా బోధన, ఉత్తమ ఫలితాలు ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు మే 9 నుంచి ఇంటర్ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. -
ముంపు ముప్పు తప్పేనా?
[ 01-06-2024]
వర్షం కురిస్తే చాలు సిరిసిల్ల పురపాలక సంఘంలోని లోతట్టు కాలనీలు జలమయం కావడం, ప్రధాన రహదారులపైకి, ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణంగా మారింది. పట్టణం చుట్టూ ఉన్న చెరువుల శిఖం ఆక్రమణలతో వాటిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. -
అతివల ఆర్థిక అభ్యున్నతికి అండ
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి రుణాలు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర వేళల్లో తోడ్పాటునందిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి లేకుండా చిరు వ్యాపారాల నిర్వహణతో ఆర్థిక బలోపేతం వైపు అడుగులు పడేలా సహకరిస్తున్నాయి. -
సుల్తానాబాద్లో లారీ బీభత్సం
[ 01-06-2024]
డ్రైవర్ మద్యం మత్తుతో శుక్రవారం సుల్తానాబాద్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. -
67 గోవులు, ఎద్దుల పట్టివేత
[ 01-06-2024]
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వాహనాల్లో తరలిస్తున్న 67 గోవులు, ఎద్దులను పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృతి
[ 01-06-2024]
ఎండలు మండిపోతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృత్యువాత పడటం విషాదం నింపింది. -
47.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో భానుడిప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముత్తారంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొంది.