6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.
నీలగిరి, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టార్ క్యాంపెయిన్లో భాగంగా నల్గొండలో సభ నిర్వహిస్తున్నామన్నారు. నల్గొండ నియోజక వర్గంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై రోడ్డుషోలో పాల్గొంటారని తెలిపారు. యువత, మహిళలు, వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు కృష్ణానది జలాలను కాపాడుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మా అభ్యర్థి లక్షల మెజార్టీతో గెలుస్తారనే చెబుతున్నారే తప్పా.. ఓడిపోతే రాజీనామ చేస్తామని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చర్చించడానికి బహిరంగంగా రావాలని మంత్రులకు సవాల్ చేశారు. 6న జరిగే నిర్వహించే సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లుగా.. ఈ నేలలో..!
[ 02-06-2024]
స్వరాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం గడిచిపోయింది. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు పాలించగా.. -
నకిలీ విత్తనాల విక్రయాలకు కట్టడి
[ 02-06-2024]
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసి అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
పల్లె ప్రగతిపై ఆరా..!
[ 02-06-2024]
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
బంధాలను అల్లుదాం.. రండి..!
[ 02-06-2024]
వేసవి సెలవులు.. పిల్లలు ఇంటి పట్టున ఉండే సమయం ఇది. సెలవుల్లో వారిని ఆటాపాటకు వదిలి పెట్టడమే సరిపోదు.. వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కోసం సమయం కేటాయించాల్సిన తరుణం ఇదేనని తల్లిదండ్రులు గుర్తించాలి. -
లక్ష్మణ్, పద్మ సమేత.. రామచిలుక
[ 02-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటకు చెందిన గౌటె లక్ష్మణ్, పద్మ దంపతులది ప్రత్యేకశైలి. వీరికి రామచిలుకలంటే అమితమైన భక్తి, శ్రద్ధ. ఏడేళ్లక్రితం వ్యాపారపరంగా తిరుగుతున్న క్రమంలో లక్ష్మణ్కు రంగురంగుల చిలుకలు కనిపించాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28)ని టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్తో కలిసి టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
ప్రభుత్వ బడికి డిజిటల్ హంగులు
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. -
గేదెను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం
[ 02-06-2024]
ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
-
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు