కూటమి గెలుపుతోనే భవన నిర్మాణ కార్మికులకు మేలు
కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భవన నిర్మాణ కార్మికులతో కలసి ఫలహారం తింటున్న సీఎం రమేశ్
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో కలసి సీఎం రమేశ్ ఫలహారం తిన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో ఎక్కువగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులేనని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించారన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరక్కుండా చేసిన కార్మికుల పొట్ట కొట్టారన్నారు. జగన్కు సొంతంగా సిమెంట్ కర్మాగారం ఉండడంతో వీటి ధరలపై నియంత్రణ లేకుండా చేశారన్నారు. ఇసుక, సిమెంట్ ధరలను పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని విధంగా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిమెంట్, ఇసుక ధరలను నియంత్రిస్తామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధి నిధులు రూ. 450 కోట్లు ఏమయ్యాయో విచారణ చేపడతామని పేర్కొన్నారు. పనుల కోసం వచ్చేవారు వేచి ఉండేందుకు వీలుగా సామాజిక భవనాన్ని నిర్మించాలని కార్మికులు కోరారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార పార్టీ అండ.. అడ్డులేని దందా..
[ 02-06-2024]
అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు.. మున్సిపల్ నేత పేరు చెప్పి మరికొందరు ఎలమంచిలిలో అక్రమంగా ఇసుక, కంకర వ్యాపారం చేస్తూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. -
భీమిలి తీరంలో విధ్వంసం ‘విజయ’వంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
విఘాతం కలిగిస్తే సహించం
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
[ 02-06-2024]
ఈ నెల నాలుగున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మురుగు సొగసు కనుమా!
[ 02-06-2024]
సాధారణంగా వర్షాకాలం వచ్చేలోపే జీవీఎంసీ అధికారులు గెడ్డలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించి పూడికలు తీయాలి. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా మొదలు కావడంతో ఇప్పటికీ చాలా చోట్ల పూడిక పనులు పూర్తికాలేదు. -
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితం
[ 02-06-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి పోలైన ఓట్లను ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని 21 హాళ్లలో లెక్కిస్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. -
సింగపూర్కు ‘ఐఎన్ఎస్ శివాలిక్’ నౌక
[ 02-06-2024]
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
[ 02-06-2024]
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించిందని ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ‘ఈ ఏడాది మార్చిలో 201 నౌకల ద్వారా 76,22,732 మెట్రిక్ టన్నుల సరకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. -
3వ తేదీన విశాఖ- గుణుపురం రైలు రద్దు
[ 02-06-2024]
నౌపడా-గుణుపురం మార్గంలో తిరుగుతున్న విశాఖ- గుణుపురం రైలు ఈ నెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
-
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు