వరంగల్
వరంగల్ లోక్సభ స్థానం1952లో ఆవిర్భవించింది. ఈ స్థానాన్ని (Warangal Lok Sabha constituency) ఎస్సీకి రిజర్వ్ చేశారు.
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: స్టేషన్ఘన్పూర్ (ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట(ఎస్సీ), పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు వరంగల్ (ఎస్సీ) ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే!
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, భాజపా నుంచి అరూరి రమేశ్, భారాస నుంచి మారేపల్లి సుధీర్కుమార్ పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం.. వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల కన్నా ముందు భారాసనే అభ్యర్థిగా కడియం శ్రీహరి తనయ కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో భారాసకు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, పార్టీ అధిష్ఠానం టికెట్టు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా భాజపాలోకి వెళ్లి పోటీలో నిలిచారు. కాంగ్రెస్లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక భారాస నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ భారాసలో చేరుతున్నారని ప్రచారమూ జరిగింది. ఆచితూచి, అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్ చివరకు వివాదరహితుడిగా పేరున్న జడ్పీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇద్దరూ వైద్యులే...
వరంగల్ భారాస అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ ఆయుర్వేద వైద్యుడు.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య సైతం వైద్యురాలే.. ఎంబీబీఎస్, ఎండీ పాథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో అనంతరం హనుమకొండలోని ప్రతిమ రిలీఫ్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
గెలుపు ఎవరిదో..!
కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తండ్రి శ్రీహరికి శాసనసభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్సభకు పోటీచేసేందుకు కమలం నుంచి అవకాశం దక్కించుకున్నారు. భారాస అభ్యర్థి పోటీ చేయడం ఇదే ప్రథమం.. ఇలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలిసారి బరిలో నిలుస్తూ ఎంపీ స్థానంపై గురి పెట్టారు.
- ఇప్పటివరకూ గెలిచిన అభ్యర్థులు వీరే!
- 1952 - పెండ్యాల రాఘవరావు (పీడీఎఫ్)
- 1957- సాదత్ ఆలీ ఖాన్(కాంగ్రెస్)
- 1962- బకర్ అలీ మిర్జా(కాంగ్రెస్)
- 1967- రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్)
- 1971-ఎస్.బి.గిరి(తెలంగాణా ప్రజా సమితి)
- 1977-జి.మల్లికార్జునరావు (కాంగ్రెస్)
- 1980-కమాలుద్దీన్ అహ్మద్ (కాంగ్రెస్)
- 1984- డా. టి. కల్పనాదేవి (తెదేపా)
- 1989-రామసహాయం సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)
- 1991-రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్)
- 1996- చందూలాల్ అజ్మీరా(తెదేపా)
- 1998-చందూలాల్ అజ్మీరా(తెదేపా)
- 1999- బోడకుంటి వెంకటేశ్వర్లు(తెదేపా)
- 2004- ధరావత్ రవీందర్ నాయిక్(తెరాస)
- 2009-సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్)
- 2014-కడియ శ్రీహరి(తెరాస),
- 2019 - పసునూరి దయాకర్ (తెరాస)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదక్
మెదక్ లోక్సభ నియోజకవర్గం (Medak Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
నాగర్కర్నూల్
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. దీన్ని (Nagarkurnool Lok Sabha constituency) ఎస్సీలకు రిజర్వ్ చేశారు. -
మల్కాజిగిరి
2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మల్కాజిగిరి శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాలు అవతరించాయి. -
హైదరాబాద్
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది (Hyderabad Lok Sabha constituency) జనరల్ కేటగిరీలోనే ఉంది. -
జహీరాబాద్
-
మహబూబాబాద్
నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. -
ఖమ్మం
ఖమ్మం లోక్సభ స్థానం ఆది నుంచి ఇది జనరల్ కేటగిరిలోనే ఉంది. -
కరీంనగర్
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. -
సికింద్రాబాద్
-
పెద్దపల్లి
2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి లోక్సభ స్థానంలో మార్పులు జరిగాయి. -
మహబూబ్నగర్
-
నిజామాబాద్
-
చేవెళ్ల
-
నల్గొండ
-
భువనగిరి
-
ఆదిలాబాద్
తాజా వార్తలు
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్