అఫ్గాన్లో శిక్షణ.. పాక్లో వ్యూహం
పుల్వామా సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాకిస్థాన్లో ఏ స్థాయి కుట్ర జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తన ఛార్జిషీట్లో కళ్లకు గట్టింది. ఈ తరహా కారుబాంబులు సిరియా.. అఫ్ఘానిస్థాన్లో వంటి రణభూముల్లోనే వాడుతుంటారు.
* పుల్వామాలో దాడి
* ఫరూఖ్ ఎన్కౌంటర్తో ఆగిన రెండోదాడి
* ఆధారాలతో సహా పట్టేసిన ఎన్ఐఏ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాకిస్థాన్లో ఏ స్థాయి కుట్ర జరిగిందో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జిషీట్ కళ్లకు కట్టింది. ఈ తరహా కారు బాంబులు సిరియా, అఫ్గానిస్థాన్ వంటి రణ భూముల్లోనే వాడుతుంటారు. దీంతో నిందితులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. ఈ బృందం భారత్ వచ్చాక జైషే మహమ్మద్ టాప్ లీడర్షిప్ ప్రత్యేకంగా వీరితో ‘టచ్’లో ఉంది. ఆపరేషన్ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని తేల్చింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ తన 13,800 పేజీల ఛార్జిషీట్లో ఫొటో, ఇతర ఆధారాలతో సహా పూసగుచ్చినట్లు పేర్కొంది.
పాకిస్థాన్లో పురుడు పోసుకున్న కుట్ర
కశ్మీర్లో కారుబాంబుతో భారీ ఉగ్రదాడి చేయాలని 2016-17లోనే జైషే మహమ్మద్ నిర్ణయించుకోగానే ఓ బృందాన్ని సిద్ధం చేసింది. మహమ్మద్ ఉమర్ అనే ఉగ్రవాదిని కారు బాంబుల తయారీలో నిపుణులు ఉన్న అఫ్గాన్కు పంపి శిక్షణ ఇప్పించింది. ఈ బృందాన్ని మెల్లిగా సాంబ-కథువా సెక్టార్కు ఎదురుగా ఉన్న షకారఘ్రలోని ఉగ్రలాంచ్ ప్యాడ్స్కు చేర్చింది. అక్కడి నుంచి అదును చూసి ఉమర్తోపాటు మరో ముగ్గురు భారత్లోకి చొరబడ్డారు. వీరు ఐఈడీలతో భద్రతా దళాలపై దాడి చేయడానికి స్థానికులు సాయం చేశారు.
ఉగ్రవాదులు భారత్లో ఉండటానికి.. వారిని ఘటనా ప్రదేశానికి తరలించడానికి నలుగురు సాయం చేశారు. ఈ క్రమంలో వీరిలో కొందరు ఉగ్రవాదులకు తమ ఇళ్లలోనే ఆశ్రయం ఇవ్వగా.. మరికొందరు శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారిపై దళాల కదలికలపై నిఘా వేసి సమాచారం సేకరించారు. షకీర్ బషీర్ తన ఇంట్లో ఆర్డీఎక్స్, జిలిటెన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను భద్రపర్చాడు.
2019 జనవరిలో సజ్జాద్ అహ్మద్ భట్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారుతోనే ఐఈడీ దాడి చేశారు. మిగిలిన వారు దాడి అనంతరం విడుదల చేయడానికి అవసరమైన ప్రచార వీడియోను చిత్రీకరించారు. దీనికి ఇన్షాజాన్ అనే వ్యక్తి ఇంటిని వాడుకొన్నారు.
ఫిబ్రవరి తొలివారంలో 160 కిలోలు, 40 కిలోల బరువున్న రెండు ఐఈడీలను సిద్ధం చేసుకొన్నారు. వీటికోసం పాక్ నుంచి వివిధ రూపాల్లో తరలించిన సామగ్రిని వాడుకొన్నారు. ఆ తర్వాత సజ్జాద్ కొనుగోలు చేసిన కారులో వీటిని అమర్చారు.
ఫిబ్రవరి 14న జాతీయ రహదారి తెరవగానే షకీర్ బషీర్ కారును బయటకు తీసి.. ఆదిల్ అహ్మద్దార్(ఫిదాయి)ను ఎక్కించుకొని జాతీయ రహదారివైపు పయనమయ్యాడు. జాతీయ రహదారి సమీపంలో కారును దార్కు అప్పగించాడు. అక్కడి నుంచి బయల్దేరిన దార్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేశాడు. దాడి తర్వాతి రోజుల్లో భద్రాతా దళాలు పలువురు కీలక సూత్రధారులను ఎన్కౌంటర్లలో మట్టుబెట్టాయి.
బిలాల్ అరెస్టుతో వీడిన గుట్టు..
జులై ఐదో తేదీన కాకాపోరాలోని హిజిబాల్కు చెందిన బిలాల్ అహ్మద్ను అరెస్టు చేశారు. అతను స్థానికంగా ఓ రంపపు మిల్లును నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం, వారిని తరలించడానికి బిలాల్ సహకరించాడు. దీంతోపాటు ఉగ్రవాదులకు స్థానికంగా జైషే సానుభూతి పరులను పరిచయం చేశాడు.
ఆ మొబైల్తో బలమైన ఆధారాలు..
ఈ కుట్రను పూర్తిగా బయటపెట్టడానికి ఓ మొబైల్ ఫోన్ సహకరించింది. పుల్వామా దాడి తర్వాత నెల రోజుల్లో మహమ్మద్ ఉమర్ ఫరూఖ్ను సైన్యం మట్టుబెట్టింది. ఈ క్రమంలో అతని మొబైల్ ఫోన్ దళాల చేతికి చిక్కింది. దానిని విశ్లేషించి కీలకమైన ఫొటోలు, వాట్సాప్ సంభాషణలు, వీడియో క్లిప్లను వెలికి తీసింది. ఈ దాడి సమయంలో జైషే టాప్ లీడర్స్ మసూద్ అజర్, రవూఫ్ అస్ఘర్, అమ్మార్ అల్వీ( ఛోటా మసూద్)లు నిందితులతో టచ్లో ఉన్నట్లు తేలింది. వారే పాక్ నుంచి సూచనలు ఇచ్చినట్లు గుర్తించింది.
మరో దాడిని అడ్డుకొన్న ‘బాలాకోట్’
పుల్వామా దాడి తర్వాత మరో కారు బాంబును కూడా కశ్మీర్లో వాడాలని ప్లాన్ వేశారు. కానీ, అఫ్గానిస్థాన్లో శిక్షణ పొందిన ఉమర్ మరణించడం, భారత్ బాలాకోట్లో జైషే క్యాంప్పై దాడి చేయడంతో వారు తమ పథకాలను ఉపసంహరించుకొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలిటికల్ యాడ్లలో భాజపా దూకుడు.. ఈసీ లిస్టులో టాప్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. -
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా తిహాడ్ జైలుకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. -
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
Mumbai hoarding collapse: గాలివానలకు హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో యాడ్ ఏజెన్సీ యజమాని గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి జరగడం నిజమేనని ఆ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ కూడా నిందితుల జాబితాలో చేరనుంది. -
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
దేశంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. -
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు (Supreme Court) .. మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించాలని సూచించింది. -
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
విమానం రద్దు కారణంగా ఒమన్లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను.. బతికుండగా చూడలేకపోయానంటూ కేరళకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
Mumbai hoarding collapse: బలమైన ఈదురుగాలుల ధాటికి సోమవారం ముంబయిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. -
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
ఎన్నికల వేళ ఆప్ గంభీరమైన వివాదంలో చిక్కుకొంది. ఆ పార్టీ మహిళా ఎంపీ ఏకంగా సీఎం ఇంట్లో దాడికి గురైనట్లు పోలీసులకు వెల్లడించారు. -
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
నేడు వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ (Modi) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
ముంబయి విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల బంగారం పట్టివేత
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్లు విలువ చేసే బంగారం పట్టుబడింది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!