Chandrababu: బాబును చూడాలని కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. విజయవాడలో ఆసక్తికర ఘటన

తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు.. కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. 

Updated : 11 Jun 2024 15:56 IST

విజయవాడ: తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు.. కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగింది. సమావేశం అనంతరం ఉండవల్లికి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు. తన పేరు నందిని అని.. తమరిని చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చానని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు. 

కష్టం ఫలించి.. మా కోరిక మేరకు సీఎం అయ్యారు సార్‌.. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతానని ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడటానికి వచ్చానని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు