AP High Court: విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపుపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated : 02 Jan 2024 13:07 IST

అమరావతి: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపుపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నాట్‌ బిఫోర్‌ మీ అని పేర్కొంది. పిటిషన్‌ త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టును ఏజీ కోరారు. కార్యాలయాల తరలింపుపై త్రిసభ్య ధర్మాసనం విచారించే వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని గతంలో సింగిల్‌ జడ్జి ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని