Chandrababu: కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Updated : 20 Apr 2024 14:10 IST

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్టపల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం తెదేపా కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలోని కణేకల్‌లో విద్యార్థులు, తెదేపా నాయకులతో కలిసి చంద్రబాబు కేక్‌ కోశారు.

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. రాయలసీమ తెదేపా నేత శ్రీధర్‌.. శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టారు. 7.50 కిలోల కర్పూరం వెలిగించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు