Eluru: వైకాపా నేత ఇంటి ముందు క్షుద్ర పూజల కలకలం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామానికి చెందిన వైకాపా నేత బండారు వెంకట సుబ్బారావు ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది.

Updated : 07 Sep 2023 13:00 IST

జంగారెడ్డిగూడెం గ్రామీణం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామానికి చెందిన వైకాపా నేత బండారు వెంకట సుబ్బారావు ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది.  పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొగ్గులు, కొబ్బరికాయ, పువ్వులు వంటివి అక్కడ పడేసి వెళ్లారు. ఉదయాన్నే వీటిని చూసిన సుబ్బారావు కుటుంబసభ్యులు భయపడి తలుపులు వేసుకున్నారు. ఈ ఘటనపై గ్రామంలోని కొంత మందిపై అనుమానం ఉందని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుబ్బారావు తెలిపారు. కాగా, చిన్నవారిగూడెం గ్రామంలో గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు చేతబడులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామస్థులు రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని