Telangana News: చేపల లారీ బోల్తా.. అరగంటలో లోడు ఖాళీ..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది.
బూర్గంపాడు: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బోల్తా పడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వారించినా..వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. 2 కేజీల బరువుండే సుమారు 4వేల చేపలు ఉన్న లారీ లోడ్ను అరగంటలో ఖాళీ చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళుతుండగా లారీ ప్రమాదానికి గురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!