Gaddar: పెత్తందారీ వ్యవస్థపై ధిక్కార స్వరం... గద్దర్
గద్దర్ పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తారు. అందుకనే ఆయనను ప్రజాయుద్ధనౌక అని వీరావేశంతో పిలుస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలోని అన్ని వర్గాలను మేలుకొలిపేది పాట. ఆ పాటనే సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పి.. చైతన్యవంతులను చేసేది ప్రజాగాయకులు. ఒక్క అక్షరం ముక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న రీతిలో ఒక్క పదం అంకుశమై పెత్తందార్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఆ పదాన్ని గేయరూపంలో పాడి కోట్లాది పీడిత ప్రజల జీవితాల్లో కదలిక తెచ్చినవారు గద్దర్. ఆయన పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తాయయి. అందుకనే ఆయనను ‘ప్రజాయుద్ధనౌక’ అని వీరావేశంతో పిలుస్తారు.
ఆయన గొంతు కోసమే వేచి ఉండేవారు..
ఆయన సభలకు వస్తున్నారంటే చాలు వేలాది ప్రజలు ఎన్నిగంటలయినా వేచి ఉండేవారు. ఆయన గొంతు విప్పితే చాలు సమ్మోహనం. కోట్ల మంది పేదల కష్టాలను, నష్టాలను పాట రూపంలో వినిపించేవాడు. ఒక విధంగా ఆయన పాటల ద్వారానే సామాన్యుల భాష వాడుక భాషగా మారిందని చెప్పవచ్చు. పాటతో పాటు ఆలాపన, నృత్యం, ప్రసంగం ఉంటాయి. ఇలాంటి విభిన్నమైన ప్రక్రియలు ఆయనకే ప్రత్యేకం.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. మూగబోయిన ఉద్యమ గళం
కర్ర పట్టి, ఎర్రజెండా చేతపట్టి..
కర్ర చేబూని ఎర్రజెండాతో ఎల్లప్పుడూ కనిపించే ఆయన ప్రజా యుద్ధక్షేత్రంలో నిత్యం కనిపించేవారు. కారంచేడు, చుండూరుల్లో జరిగిన దళితుల హత్యాకాండలో పాటలతో అమరవీరులకు వందనం అర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన గానం చేసిన పాటలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. గద్దర్ బాటలో తెలంగాణలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ప్రజాగాయకులు ఆవిర్భవించారు. తమ పాటలతో నిత్యం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వెన్నులో తూటా బాధిస్తున్నా కదిలే పాటగా మారి
1997లో గద్దర్పై దాడి జరిగింది. వెన్నులో బుల్లెట్ బాధపెడుతున్నా అణగారిన గొంతుకల కోసం పాటను పల్లెపల్లెకు తీసుకెళ్లారు. తూటాలు దిగినా ఆయన వెనుకంజ వేయలేదు. తుదిశ్వాస వరకు గొంతులేని వారి కోసం గొంతుకగా మారారు. గళమెత్తారు.. ఆడారు.. పాడారు.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం పోరాటం చేశాడు.
ఆయన పాటలు అగ్నికణాలు
గద్దర్ గాయకుడే కాదు. మంచి రచయిత కూడా. ప్రజల వేదనలను పాటలుగా రూపొందించారు. ‘‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో’’ పాటలో తన తల్లి పడుతున్న బాధలను పాటగా మలిచారు. ఇంకా అనేక పాటలు ప్రజల పక్షాన నిలిచాయి. దోపిడీని ప్రశ్నించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు నిత్యస్మరణగా మారాయి. పీడిత ప్రజల వేదనను చూసిన కాలమే కన్నబిడ్డ గద్దర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే!
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
Vande Bharat express | విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. -
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని నగరవాసులంతా చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?