నిత్యావసర సరకులకు వెళ్తున్నారా.. జాగ్రత్తలివే?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ఏ వైపు నుంచి ఏ రూపంలో కమ్ముకొస్తుందోనని......

Published : 05 May 2020 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ఏ వైపు నుంచి ఏ రూపంలో కమ్ముకొస్తుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా కట్టడే ధ్యేయంగా భారత్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌-3 నేపథ్యంలో ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రం దుకాణాలు/ రైతు బజార్లు/ సూపర్‌ మార్కెట్లు/ మందుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారినపడకుండా ఉండేందుకు కేంద్రం సూచిస్తున్న జాగ్రత్తలేంటో చూద్దామా..!

> సొంత బ్యాగ్‌ను తీసుకెళ్లండి.
> గుడ్డ సంచులనే వాడండి. ప్లాస్టిక్‌/ పేపర్‌ బ్యాగుల వాడకానికి దూరంగా ఉండండి. 
>  షాపింగ్‌ పూర్తయిన తర్వాత సంచిని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
> సరకులను కొనుగోలు చేస్తున్న సమయంలో  మాస్క్‌ ధరించాలి.
> వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకే ప్రాధాన్యమివ్వండి. నగదు చెల్లింపులను తగ్గించండి
> షాపింగ్‌ సమయంలో మీ ముఖాన్ని చేతులతో తాకొద్దు.
> తరచుగా బయటకి రావొద్దు.
> ఇతరులకు కనీసం 1 మీటర్‌ దూరం పాటించాలి.
> షాపింగ్‌ సమయంలో వాడే బాస్కెట్‌/ ట్రాలీలను పట్టుకొనే భాగాన్ని శానిటైజ్‌ చేసుకోండి
> షాపింగ్‌కు వెళ్లే ముందు సరకులు కొని ఇంటికి వచ్చిన చేతులను శుభ్రం చేసుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని