Andhra news: మే, జూన్ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి: పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ .. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు.
‘‘పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ విధానంలో నగదు బదిలీ లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పింది. లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గతంలో జారీ చేసిన ఆదేశాల స్ఫూర్తిని తీసుకోవాలని సూచించింది. కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా లబ్ధిదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని చెప్పింది. ఈసీ ఆదేశాల మేరకు మే, జూన్ మాసాలకు ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతలకు పింఛన్ సొమ్ము జమ చేస్తాం.
మొత్తం 65,49,864 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో 74 శాతం మందికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ వ్యవస్థ ద్వారా నగదు జమ చేస్తాం. 48,92,503 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ మ్యాపింగ్ అయి ఉంది. మే 1న వీరందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. మొబైల్ లింక్ అయిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు జమ అయినట్టు సంక్షిప్త సందేశం వస్తుంది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానపడిన వారు, వీల్ చైర్లకు పరిమితమైనవారు, వితంతువులతో పాటు బ్యాంకు ఖాతా లేని వారికి ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తాం. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లను ఆదేశించాం’’ అని శశిభూషణ్ కుమార్ తెలిపారు.
వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. సీఎస్ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. దీంతో ఏప్రిల్లో పింఛను కోసం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. మే, జూన్ నెల పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం ఓట్ల పండుగతో బోసిపోయింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
నగరంలోని వేంకటేశ్వర కాలనీలో భారీగా బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఐదు వసంతాల పండగ.. కదలాలి కేంద్రాలకు నిండుగా
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఒక జాతీయ, రాష్ట్రీయ వేడుక. ఏదైనా పండుగ వస్తే ఒక సామాజికవర్గం సంబరాలు చేసుకుంటుంది. -
ఓటర్లను కదిలించు తల్లీ..
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు