Lasya Nanditha: లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు.

Updated : 23 Feb 2024 13:52 IST

సికింద్రాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ వెంట.. హరీశ్‌రావు, తలసాని తదితరులు ఉన్నారు. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో లాస్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్‌ కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని