Komatireddy: బొకేలు, శాలువాలు వద్దు.. ఆ డబ్బు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు ఇవ్వండి: మంత్రి కోమటిరెడ్డి

డబ్బులు వృథా చేయకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తే నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

Published : 31 Dec 2023 17:11 IST

హైదరాబాద్‌: డబ్బులు వృథా చేయకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తే నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతాయని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనను కలిసేందుకు వచ్చే నాయకులు బొకేలు, శాలువాలకు పెట్టే ఖర్చును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని.. ప్రజాపాలన, ఇతర కార్యక్రమాల ద్వారా తామే ప్రజల ఇంటి ముందుకు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. భారాస ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట దోచుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని