Nara Bhuvaneshwari: బాపట్ల జిల్లాలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగింది.

Updated : 30 Jan 2024 18:57 IST

బాపట్ల: నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాలో కొనసాగింది. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో రామలింగేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకుని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని