Telangana News: నగర వాసులకు ఉపశమనం... హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు.

Updated : 05 Jun 2022 16:25 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. ఉదయం నుంచి ఎండవేడితో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్‌ మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం కురిసింది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని