YS Jagan: వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
వెంకటగిరి: సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేయడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో పలు రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి వచ్చే కాశీపేట- రైల్వేస్టేషన్ రహదారిలో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో వాహనదారులు వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాలేజీమిట్ట రహదారిలో ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో కొందరు వాగ్వాదానికి దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్