SC Railway: విమానాశ్రయాలకు దీటుగా .. చర్లపల్లి రైల్వే టెర్మినల్: దక్షిణ మధ్య రైల్వే
జంటనగరాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్గా అవతరించనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
చర్లపల్లి: జంటనగరాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్గా అవతరించనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జంట నగరాలకు ప్రత్యామ్నాయం టెర్మినల్గా అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి స్టేషన్లో జరుగుతున్న పనులను అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల పనులు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన పనుల పురోగతిని జీఎంకు అధికారులు వివరించారు. అధికారుల బృందాన్ని అభినందించిన జీఎం.. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న స్టేషన్ నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. కోచ్ నిర్వహణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
రూ.221 కోట్లతో అభివృద్ధి పనులు...
చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్గా అభివృద్ధి చేయడానికి రైల్వే బోర్డు రూ.221 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. మొదటి దశ, రెండో దశ కింద చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, 2023 చివరి నాటికి పనులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్లో చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ.82 కోట్లు కేటాయించారన్నారు. చర్లపల్లి వద్ద పిట్లైన్ల కోసం ఆల్ వెదర్ కవర్ షెడ్ నిర్మించాలని ప్రతిపాదించామని, మంజూరు కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలవగా.. అనేక చోట్ల ట్రాఫిక్జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
నగరంలో భారీ వర్షం కురుస్తోంది. వరదలతో హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే!
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
Vande Bharat express | విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. -
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని నగరవాసులంతా చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్