AP News: ఏ బ్యాంకులో .. ఏపీ సర్కారుకు ఎన్ని అప్పులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో వెల్లడించారు.
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో వెల్లడించారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. 2019 నుంచి 2021 నవంబరు వరకూ జాతీయ బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు.
ఏ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసిందంటే?
* అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్లు రుణం పొందాయి.
* బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్లు
* బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7వేల కోట్లు
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్లు
* కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు,
* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు
* ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.5,500కోట్లు
* ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ.1,750కోట్లు
* పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు
* యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్