Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తిరుమలలో చిక్కిన మరో చిరుత
తిరుమలలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ, తితిదే అధికారులు తెలిపారు. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు నడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రద్దు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్రేమ పేరుతో వాలంటీరు మోసం
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి పరారైన ఓ వాలంటీరు ఉదంతం కాశినాయన మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (22), మాచవరం చెన్నారెడ్డి గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో మందలించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కాంగ్రెస్ టికెట్ దరఖాస్తు రుసుం రూ.50 వేలు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తు రుసుం రూ.50 వేలు చొప్పున వసూలు చేయాలని పార్టీ యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.25 వేలు చెల్లించేలా సడలింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పార్టీ ఉపకమిటీని ఏర్పాటు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వేడెక్కిన జనగామ రాజకీయం
జనగామ నియోజకవర్గ భారాస రాజకీయం వేడెక్కింది. స్థానిక ముఖ్యనేతలు కొందరు బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమవడం... ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం నేరుగా వారి వద్దకే వెళ్లడం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి టికెట్ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరడానికే... జనగామ, చేర్యాల ప్రాంతాలకు చెందిన భారాస నేతలు, పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఓరుగల్లు నుంచి ఎన్నికల శంఖారావం!
ఎన్నికల ప్రచారాన్ని భారాస ఓరుగల్లు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ సహా గులాబీ నేతలంతా పాల్గొనే ఈ సభను అక్టోబరు 16న హనుమకొండ జిల్లా ఉనికిచర్ల ప్రాంతంలో జరిపేందుకు తేదీ ఖరారైంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఉమ్మడి వరంగల్ నేతలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇక పన్ను పోటే
ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆస్తిపన్ను రాయితీలు ప్రకటించే జీహెచ్ఎంసీ.. తాజాగా ఆ రాయితీలకు కత్తెర వేస్తోంది. 2016 ఎన్నికల్లో రూ.1000 ఆస్తిపన్ను చెల్లిస్తోన్న భవనాలకు రూ.101కి తగ్గించింది. అనంతరం సునామీ సర్వే పేరుతో లబ్ధి పొందిన 1.33 లక్షల నిర్మాణాలను సర్వే చేసింది. సగానికిపైగా భవనాలు రాయితీకి అనర్హమని తేలాయి. పైగా వాటి పన్ను భారీగా పెరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. జాబిల్లి చుట్టూ ఏముందో తెలుసుకుందాం..
జాబిల్లి చుట్టూ ఏముందో తెలుసుకునేందుకు చంద్రయాన్-3 పేరుతో ఇస్రో పంపించిన వ్యోమనౌక విక్రమ్ ల్యాండర్.. ప్రజ్ఞాన్ రోవర్ల కదలికల సమాచారాన్ని నగరంలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అందించనుంది. చంద్రయాన్-3లో కీలకమైన ఆపరేషన్ ‘మూన్ బౌండ్ మానివర్’ను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం పూర్తిచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 10 రోజుల్లో ఏఈఈ మెరిట్ జాబితా
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించిన పరీక్ష మెరిట్ జాబితా త్వరలోనే వెలువడనుంది. సివిల్ పోస్టులకు సంబంధించి పరీక్ష మార్కులను మాత్రం నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి న్యాయవివాదం పరిష్కారమైన వారం, పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రాష్ట్రపతి పాలనలో రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించొచ్చా?
రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించొచ్చా...? అని బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ప్రశ్న లేవనెత్తింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!