Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తిరుమలలో చిక్కిన మరో చిరుత
తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం- 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనితో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మూడు కూటముల ముద్దుగుమ్మ
మన రాజధాని దిల్లీ ఆతిథ్యం ఇస్తుండటంతో... దేశమంతా జీ20 పేరు మారుమోగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కిపైగా దేశాల అధినేతలు హస్తినలో రెండ్రోజుల పాటు భేటీ కాబోతున్నారు! ఇంతకూ ఏంటీ జీ20? దీని లక్ష్యాలేంటి? ప్రాధాన్యమేంటి? సవాళ్లేంటి?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మేల్కొంటేనే.. రామప్పకు గుర్తింపు!
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి ఎంతో కృషి జరిగింది. దాన్ని కాపాడుకునే దిశలో మాత్రం పూర్తిస్థాయి ప్రయత్నాలు కొనసాగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యునెస్కో అడిగిన నివేదికలను పంపించడంలో జాప్యం చోటుచేసుకుంటే ‘గుర్తింపు’ సందేహస్పదమే అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఒకసారి చెబితే.. 22 భాషల్లోకి తర్జుమా!
డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇకపై వారి మాతృభాషలోనే డిజిటల్ పద్ధతిలో పాఠాలు నేర్చుకోనున్నారు. ఇంగ్లిష్ సహా ఇతర భాషల్లో చెప్పిన వీడియో పాఠం... ‘స్పీచ్ ట్రాన్స్లేషన్’ సాఫ్ట్వేర్ ద్వారా దానంతటదే అనువాదమై విద్యార్థులకు ‘రాత’రూపంలో అందనుంది. ఇప్పటివరకు ఎనిమిది భాషల్లో అందుబాటులో ఉన్న 45 వేల డిజిటల్ పాఠాలను 22 భాషల్లోనూ వచ్చేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబేలోని ఆచార్యులు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. టీకాకు పెద్దలు దూరం
వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలకు 50 ఏళ్లు ఆపై వయసు దాటిన వారు దూరంగా ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా 16నగరాల్లో ‘ది అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా’(ఏపీఐ) చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల కూడా వైద్యులు పెద్దలకు టీకాలను సిఫార్సు చేయలేకపోతున్నట్లు అధ్యయనం విశ్లేషించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సేద్యానికి పగలే కరెంటు ఇవ్వండి
వ్యవసాయ బోర్లకు రోజూ పగటిపూట మాత్రమే కరెంటు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం వేళ సౌర విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వ్యవసాయానికి సరఫరా చేయడం ద్వారా దేశంలో విద్యుత్ డిమాండును తీర్చడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వైకాపా రాళ్ల దాడిలో మాజీ ఎమ్మెల్యేకు విరిగిన పక్కటెముక
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి వద్ద యువగళం పాదయాత్ర బృందంపై మంగళవారం జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలువపూడి శివ)ను చికిత్స నిమిత్తం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు తరలించారు. వైకాపా మూకలు విసిరిన రాయి ఆయన ఛాతీ భాగంలో తగలడంతో పక్కటెముక విరిగినట్లు తెదేపా నాయకులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ పేరుతో గెజిట్ ముద్రణ
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ పేరుతో ఎన్నికల సంఘం గెజిట్ ముద్రణ ప్రక్రియను పూర్తిచేసింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేగా డీకే అరుణను పేర్కొంటూ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ గెజిట్ ముద్రణ పూర్తిచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కుల్దీప్ తిరిగొచ్చాడిలా..
ఇప్పుడు మూడు ఫార్మాట్లలో కుల్దీప్ టీమ్ఇండియాకు రెగ్యులర్ స్పిన్నర్. వన్డే ప్రపంచకప్లోనూ కీలక బౌలర్గా బరిలోకి దిగుతున్నాడీ ఉత్తర్ప్రదేశ్ కుర్రాడు. రెండేళ్ల కిందట పతనం చవిచూసిన కుల్దీప్.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం అనూహ్యం. మరి ఈ మార్పు ఎలా సాధ్యం అంటే..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైకు
టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 310 బైకును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.42-2.64 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దేశీయ, అంతర్జాతీయ విపణుల కోసం రూపొందించిన ఈ బైకులో 312.2 సీసీ ఇంజిన్ను అమర్చారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు