TS High Court: వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Updated : 12 Jan 2024 08:19 IST

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించిన వివాదంపై ఈ నెల 22వ తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ‘వ్యూహం’కు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆ సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.  చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చిత్రీకరించిన ‘వ్యూహం’ సినిమా ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ లోకేశ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని