Fire Accident: హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

పట్నాలోని ఓ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 25 Apr 2024 17:04 IST

పట్నా: బిహార్‌ రాజధాని పట్నా (Patna)లోని ఓ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్నా రైల్వేస్టేషన్‌ సమీపంలోని హోటల్‌లో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్‌

ఉదయం 11 గంటల సమయంలో హోటల్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడమే అందుకు కారణమని తెలుస్తోంది. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మంటల్లో చిక్కుకుపోయిన కొందరిని రక్షించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని