బిహార్: 1200 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు!
బిహార్ ఎన్నికల బరిలో ఉన్న 1200మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 115 మంది మహిళలకు సంబంధించిన నేరాలు కాగా, మరో 73 మంది హత్య కేసుల్లో కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు.
ఏడీఆర్ నివేదికలో వెల్లడి
దిల్లీ: బిహార్ ఎన్నికల బరిలో ఉన్న 1200మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 115 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు కాగా, మరో 73 మంది హత్య కేసుల్లో కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న మొత్తం 3722 మంది అభ్యర్థుల్లో 1201 (32శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. వీరిలో 915 మందిపై (25శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నాన్-బెయిలబుల్ కావడంతో పాటు, ఒకవేళ నేరం రుజువైతే ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 3450 మంది అభ్యర్థుల్లో 1038(30శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించగా ప్రస్తుతం అది 32శాతానికి పెరిగింది. దీంతో 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బిహార్లో 217 స్థానాలు ‘రెడ్ అలర్ట్’ స్థానాలుగానే ఏడీఆర్ ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీచేస్తున్న వారిలో ముగ్గురు కంటే ఎక్కువ అభ్యర్థులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.
క్రిమినల్ నేరాలు ఉన్నట్లు ప్రకటించిన 37శాతం నుంచి 70శాతం అభ్యర్థులకే రాజకీయ పార్టీలు పోటీచేసేందుకు అవకాశం కల్పించినట్లు ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగ్దీప్ ఛోకర్ వెల్లడించారు. ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారికే పోటీచేసే అవకాశం ఎందుకు కల్పించాల్సి వచ్చింది?, ఎలాంటి నేర చరిత్ర లేనివారికి అవకాశం ఎందుకు ఇవ్వడంలేదని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ప్రశ్నించిన విషయాన్ని ఛోకర్ తాజా నివేదికలో ప్రస్తావించారు. నివేదికలోని మరిన్ని అంశాలు..
*మహిళలకు సంబంధించిన కేసులు ఉన్న 115 మందిలో 12మంది అత్యాచారం (ఐపీసీ సెక్షన్-376) కేసు ఎదుర్కొంటున్న వారే ఉన్నారు.
*ఇక మర్డర్ కేసులు ఉన్నవారు (సెక్షన్-302) 73 మంది ఉండగా, మరో 278 మంది హత్యాయత్నం (సెక్షన్-307) కేసులు ఎదుర్కొంటున్నారు.
*అత్యధికంగా ఆర్జేడీ, భాజపా అభ్యర్థుల్లో 70శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
*ఆర్జేడీకి చెందిన 141 అభ్యర్థుల్లో 98 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, భాజపాకు చెందిన 109 మందిలో 76 మందిపై కేసులున్నాయి.
*కాంగ్రెస్ నుంచి 64శాతం, ఎల్జేపీ నుంచి 52శాతం, జేడీయూ నుంచి 49శాతం, బీఎస్పీ నుంచి పోటీచేస్తున్న వారిలో 37శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మొత్తం 3722 అభ్యర్థుల్లో 349 మంది జాతీయ పార్టీలు, 470 మంది అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందినవారు కాగా మరో 1607 మంది రిజిష్టర్ గుర్తింపుపొందని పార్టీల నుంచి ఉన్నారు. ఇక మరో 1296 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇక, మొత్తం అభ్యర్థుల్లో 1231 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్