Ajit Pawar: మోదీని కొనియాడిన అజిత్ పవార్.. ఎవరితో పోల్చారంటే..?
దివంగత నేత రాజీవ్ గాంధీలా ప్రధాని మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి కీర్తిని సంపాదించారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కొనియాడారు.
పుణె: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప పేరున్న నాయకుడని.. ఆయనలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే కీర్తిని సంపాదించారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కొనియాడారు. ప్రధాని మోదీ ‘లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారం’ అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వంలో చేరడంపై ఆయన వివరణ ఇచ్చారు.
దివంగత నేతలు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే కీర్తిని సంపాదించారని కొనియాడారు. తాను మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్తో కలిసి కార్యక్రమానికి వెళ్తుండగా.. ప్రజలంతా రోడ్డుకు ఇరువైపుల నిలబడి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారని తెలిపారు. ఎక్కడా వ్యతిరేక నినాదాలు, నల్ల జెండాలు కనిపించలేదన్నారు. ప్రజలు మోదీపై ఆదరణ చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
‘‘ఏ ప్రధానమంత్రి అయినా దేశంలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తారు. మణిపుర్ ఘటనను ఎవరూ సమర్థించరు. ఈ విషయం ప్రధాని దృషికి వచ్చింది. సుప్రీం కోర్టు కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. అక్కడ జరిగిన ఘోరాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దోషులకు శిక్ష పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దీపావళి లాంటి పండుగలను తమ కుటుంబంతో కలిసి చేసుకుంటారు. కానీ, ఆయన మాత్రం సరిహద్దులోని సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న పాపులారిటీ మరే నాయకుడికి లేదు. తొమ్మిదేళ్లుగా దేశం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దాని ఫలితంగా ప్రపంచస్థాయిలో భారత్కు మంచి గౌరవం లభిస్తోంది’’ అని అజిత్ పవార్ అన్నారు.
అందుకే.. భాజపా ప్రభుత్వంలో చేరా..
ఎన్సీపీని చీల్చి భాజపా ప్రభుత్వంలో చేరడంపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి. ప్రతిపక్షంలో ఉంటే నిరసనలు, ధర్నాలు చేయవచ్చు. కానీ, ఏ అభివృద్ది జరగాలన్నా నిర్ణయం అధికారంలో ఉన్నవారిదే. అందుకే.. భాజపా (శివసేన) ప్రభుత్వంలో చేరా’’అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.