Viral video: గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Viral video | ఇంటర్నెట్డెస్క్: తల్లి పుట్టినరోజున ప్రత్యేకమైన బహుమతి అందించాలనుకున్నాడు ఓ బుడతడు. అందుకోసం విమాన సిబ్బంది సాయం కోరాడు. ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా నడుచుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ బాలుడు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. అతడి తల్లి పుట్టినరోజు వేడుకను విమానంలోనే జరిపి ఆమెను ఆశ్చర్యపరిచింది.
విమానంలో అనౌన్స్మెంట్ ఇస్తున్న పైలెట్ వద్దకు వెళ్లాడు ఓ అబ్బాయి. ఈరోజు తన తల్లి పుట్టినరోజు అని, శుభాకాంక్షలు తెలుపుతూ విమానంలో స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాలని కోరాడు. దీనికి సిబ్బంది అంగీకరించారు. ఆ తల్లి కోసం ప్రత్యేక అనౌన్స్మెంట్ చేశారు. అంతేకాదు విషెస్ తెలుపుతూ చేతితో రాసిన నోట్, ప్రత్యేక ట్రీట్ కూడా ఇచ్చారు. ప్రయాణికులందరి శుభాకాంక్షలతో ఆ తల్లి ముఖం చిరునవ్వుతో నిండిపోయింది.
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
ఎయిర్లైన్స్ సిబ్బందిలో ఒకరైన అఫ్జల్ఖాన్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తల్లికి సర్ప్రైజ్ చేసేందుకు బాలుడు చేసిన ప్రయత్నంపై విమాన ప్రయాణికులతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అబ్బాయి ఆలోచనను, సిబ్బంది సహకరించిన తీరును కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!