Hit-and-Run case: కారు బానెట్‌పై మనిషి ఉన్నా.. 1.5 కి.మీ. ఈడ్చుకెళ్లి..!

Eenadu icon
By National News Team Published : 30 Oct 2025 10:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. బైక్‌ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని 1.5 కి.మీ. మేర ఈడ్చుకెళ్లాడు. గుజరాత్‌లోని మోడస లునావాడ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Hit-and-Run in Gujarat) 

ప్రమాద సమయంలో కారులో ఉన్న టీచర్, అతడి సోదరుడు మద్యం మత్తులో ఉన్నారు. అదే సమయంలో అటుగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. మద్యంతాగి ఒళ్లు తెలియని మైకంలో కారు నడుపుతోన్న టీచర్ ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ విషయం కూడా గుర్తించకుండా బానెట్‌పై పడిన బైక్‌ను అలాగే 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ బానెట్‌పై బైక్‌తో పాటు ఓ వ్యక్తి ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాల్లో కనిపించింది. కొంతదూరం వెళ్లిన తర్వాత కారు బానెట్‌పై ఉన్న వ్యక్తి కిందపడిపోయాడు (Car dragged Bike). 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అందులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు మనీశ్‌ పటేల్‌, మెహుల్ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరు బాధితులను లునావాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు