EVM: ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్‌’.. స్పందించిన ఈసీ

EVM: పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్‌ యంత్రాలకు భాజపా ట్యాగ్ ఉన్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

Published : 25 May 2024 13:16 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ వేళ ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్ (BJP Tag On EVMs)’లు పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో కలకలం సృష్టించాయి. బాంకురా జిల్లాలోని కొన్ని ఓటింగ్‌ యంత్రాలపై భాజపా అని రాసి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ ఆరోపించింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ ట్యాగ్‌లపై స్పష్టతనిచ్చింది.

‘‘ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి భాజపా (BJP) ఓట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు చెప్పారు. ఈ రోజు అది బయటపడింది. బాంకురా జిల్లాలోని రఘునాథ్‌పుర్‌లో 5 ఈవీఎంలకు భాజపా ట్యాగ్‌లు కన్పించాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో ఆరోపించింది. ఈ పోస్ట్‌కు ట్యాగ్‌ల ఫొటోలను జత చేసింది.

విపక్షాల గాలి బుడగ పేలిపోయింది: ప్రధాని మోదీ

దీనికి బెంగాల్‌ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎం (EVM)లను పెట్టినప్పుడు కామన్‌ అడ్రస్‌ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. మీరు (టీఎంసీ) పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం భాజపా అభ్యర్థికి చెందిన ఏజెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుకే ఆయన సంతకం తీసుకున్నాం. ఆ తర్వాత పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తాం. ఈ ప్రక్రియంతా వీడియోగ్రాఫ్‌ చేస్తాం. సీసీటీవీల్లోనూ రికార్డ్‌ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని