అంతరిక్ష వ్యాపారంలో భారత్ ఆశ్చర్యపరిచే పోటీదారు!.. ‘న్యూయార్క్ టైమ్స్’ అసాధారణ ప్రశంసలు
భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్ టైమ్స్’(ఎన్వైటీ) ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష రంగంలో సాంకేతికతల అభివృద్ధికి ఏర్పాటైన అంకుర సంస్థల(స్టార్టప్స్) కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
హైదరాబాద్కు చెందిన స్కైరూట్, ధ్రువ స్పేస్ల ప్రస్తావన
న్యూయార్క్: భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్ టైమ్స్’(ఎన్వైటీ) ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష రంగంలో సాంకేతికతల అభివృద్ధికి ఏర్పాటైన అంకుర సంస్థల(స్టార్టప్స్) కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఓ విస్పోటం మాదిరిగా సాంకేతికాభివృద్ధి, నవోన్వేషణలు జరుగుతున్నాయని, త్వరలోనే చైనాకు ప్రధాన పోటీదారుగా మారగలదని పేర్కొంది. ‘ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో ఆశ్చర్యపరిచే పోటీదారు’ అనే శీర్షికన ప్రత్యేక వ్యాసాన్ని ఎన్వైటీ ప్రచురించింది. ‘‘1963లో తొలి రాకెట్ ప్రయోగం నాటి దశ నుంచి ఈ రంగంలో బుడిబుడి అడుగులు వేసుకుంటూ నేడు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతలు గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. కరోనా ప్రారంభ సమయానికి దేశంలో అంతరిక్ష సాంకేతికతలపై పనిచేసే అంకుర సంస్థలు 5 మాత్రమే. నేడు ఈ రంగంలో కనీసం 140 స్టార్టప్లు నమోదై ఉన్నాయ’’ని పేర్కొంది. అంతరిక్ష రంగంలోని వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జరుగుతున్న భారీ ప్రయత్నంగా ఎన్వైటీ అభివర్ణించింది.
ఒక సాంకేతిక శక్తిగా ప్రముఖ స్థానానికి భారత్ ఎలా చేరుకుంటుందో వివరిస్తూ...గత నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి అగ్రనేతలిద్దరూ ఆ సందర్భంగా వెలువరించిన సంయుక్త ప్రకటనను ఉటంకించింది. ఉమ్మడి శత్రువైన చైనాను అత్యంత సమర్థంగా ఎదుర్కోవడానికి భారత్, అమెరికా దేశాలకు అంతరిక్ష రంగం సరైన వేదిక కాబోతోందని తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్లను ఎన్వైటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. చౌకగా ఉపగ్రహ వాహకనౌకల సేవలు అందించేందుకు ఆ సంస్థలు చేస్తున్న ప్రయోగాలు, నూతన సాంకేతికతల అభివృద్ధి, యువ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత తదితరాలను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు అవసరమైన పరికరాలు, ఉపకరణాల తయారీ కోసం బెంగళూరు, హైదరాబాద్, పుణే తదితర నగరాల్లో 400కు పైగా ప్రైవేటు కంపెనీలు ఆవిర్భవించాయని తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మరికొన్ని అంకుర సంస్థల కొత్త ఆవిష్కరణలనూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.