Facebook love: పాక్‌ ప్రియుణ్ని పెళ్లాడిన భారత మహిళ

ప్రియుణ్ని కలుసుకోవడానికి పాకిస్థాన్‌ వెళ్లిన రాజస్థాన్‌ మహిళ అంజూ (34) వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Updated : 26 Jul 2023 12:31 IST

ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా మారిన అంజూ

పెషావర్‌: ప్రియుణ్ని కలుసుకోవడానికి పాకిస్థాన్‌ వెళ్లిన రాజస్థాన్‌ మహిళ అంజూ (34) వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని స్థానిక కోర్టులో అంజూ, ఆమె ప్రేమికుడు నస్రుల్లా (29) మంగళవారం వివాహం చేసుకున్నారని డీఐజీ స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘వివాహం ముందు అంజూ ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. ఎవరి బలవంతం లేకుండా నిఖా చేసుకుంటున్నామని వధూవరులు అంగీకరించారు. బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. వివాహం చేసుకోవడానికి ముందు సోమవారం అంజూ, నస్రుల్లాలు భారీ భద్రత నడుమ స్థానిక పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. ఒక గార్డెన్‌లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోలు కూడా తీయించుకున్నారు. మరోవైపు తన పాక్‌ పర్యటన అకస్మాత్తుగా జరిగినది కాదని అంజూ (ఫాతిమా) చెప్పినట్లు పాక్‌ వార్తా సంస్థ జియో తన కథనంలో పేర్కొంది. తన ప్రేమను వెతుక్కుంటూ పాక్‌ వచ్చానని, ఇక్కడే ఉండిపోతానని అంజూ తమకు చెప్పినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారని ఈ కథనం పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు