స్థానిక భాషల్లో చట్టాలు.. ఐపీసీనీ మారుస్తున్నాం
అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడంతోపాటు స్థానిక భాషల్లోకి చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చట్టాలు, న్యాయ ప్రక్రియలో వాడే భాష న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ
న్యాయ పరిష్కారంలో సంస్థాగత భాగస్వామ్యానిదే ముఖ్య పాత్ర
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టీకరణ
దిల్లీ: అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడంతోపాటు స్థానిక భాషల్లోకి చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చట్టాలు, న్యాయ ప్రక్రియలో వాడే భాష న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దిల్లీలో రెండు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును శనివారం ప్రధాని ప్రారంభించారు.
ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, లార్డ్ ఛాన్సలర్, బ్రిటన్ న్యాయశాఖ మంత్రి అలెక్స్ చాక్ కేసీ, భారత్ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్ర తదితరులు హాజరయ్యారు. ప్రధాని మాట్లాడుతూ.. కృత్రిమ మేధను ఉపయోగించుకుని సైబర్ తీవ్రవాదం, మనీ లాండరింగ్ ద్వారా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలకు సరిహద్దులు లేవని, పరిధి ఉండదని, దేశాలన్నీ కలిసి న్యాయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం అంతర్జాతీయంగా ఉన్నప్పుడు అదే స్థాయిలో దానిని డీల్ చేయాలని సూచించారు. ‘అన్ని దేశాల మధ్య విమాన రవాణా నియంత్రణ వ్యవస్థల్లో సహకారం ఉండాలి. ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ప్రమాదాల నుంచి రక్షణకు అంతర్జాతీయ నిబంధనలను రూపొందించుకోవడం అవసరం’ అని పేర్కొన్నారు.
ఇద్దరికీ అర్థమయ్యేలా..
‘ప్రభుత్వపరంగా మేం చట్టాలు రెండు మార్గాల్లో అందుబాటులో ఉండాలని ఆలోచిస్తున్నాం. ఒకటి న్యాయ వ్యవస్థలోని వారు సులభంగా ఉపయోగించుకునేలా ఉండాలి, మరొకటి దేశంలోని సామాన్యుడు అర్థం చేసుకునేలా ఉండాలని భావిస్తున్నాం. చట్టాన్ని సామాన్యుడు తనదిగా భావించాలనేది మా అభిలాష’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘చట్టాలను సరళంగా, అందరికీ అర్థమయ్యేలా మార్చాలని అనుకుంటున్నాం. వ్యవస్థ పుట్టుక, చట్టాల రూపకల్పన సంక్లిష్టత నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాం. దీనికి ఎంతో చేయాల్సి ఉంది. ఎంతో సమయం తీసుకుంటుంది. అయినా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాం. డేటా రక్షణ చట్టంతో ఈ ప్రక్రియను ప్రారంభించాం’ అని ప్రధాని చెప్పారు. వలస కాలంనాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), సాక్ష్యాధారాల చట్టాలను మారుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను ప్రవేశపెట్టామని చెప్పారు. జ్యుడీషియరీ, బార్ అసోసియేషన్లు సుదీర్ఘకాలంగా భారతీయ న్యాయ వ్యవస్థకు రక్షణగా నిలుస్తున్నాయని, భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాయని ప్రధాని వెల్లడించారు.
మధ్యవర్తిత్వ పరిష్కార వేదిక భేష్
వాణిజ్య లావాదేవీల్లో పెరుగుతున్న సంక్లిష్ట ప్రత్యామ్నాయ పరిష్కార తీర్మానం అనేది ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోందని తెలిపారు. ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిత్వ పరిష్కార వ్యవస్థను భారత్ తీసుకొచ్చిందని తెలిపారు. గత ఆరేళ్లుగా లోక్ అదాలత్లు వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, దాదాపు 7 లక్షల వివాదాలను పరిష్కరించాయని వెల్లడించారు.
సంస్థాగత భాగస్వామ్యమే ముఖ్యం
న్యాయపరమైన సందేహాలకు పరిష్కారం చూపడంలో సంస్థాగత భాగస్వామ్యానిదే ముఖ్య పాత్రని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇది న్యాయాన్ని అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘న్యాయం అందించడంలో ఒక్కో సవాలుకు ఒక్కో పరిష్కారంగా కాకుండా సవాళ్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి నిబంధనావళి రూపొందించాలి. వాటికి వినూత్న పరిష్కారాలను కనుగొనాలి. విజ్ఞాన మార్పిడి అనేది పరస్పర ఆధారితం. సుప్రీంకోర్టు ఈ విషయంలో విదేశీ కోర్టులతో సంబంధాలు నెరపుతూనే ఉంది’ అని సీజేఐ పేర్కొన్నారు.
విభేదాల మాటున మరిచిపోతున్నాం
‘విభేదాలపై గట్టిగా పట్టుబడుతూ మనం సంస్థల మధ్య భాగస్వామ్య అవసరాన్ని మరిచిపోతున్నాం. ఇది న్యాయం చేయడంలో అడ్డంకిగా ఉందనేది నిజం. కీలకమైన రాజ్యాంగ అంశాల్లోనే కాకుండా కోర్టులు, ప్రభుత్వం మధ్య దైనందిన వ్యవహారాల్లోనూ ఇది కనిపిస్తోంది. మేం మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చిన్న వాహనాలను నడిపే డ్రైవరు వాణిజ్య వాహనాలను నడపొచ్చా అనే కేసును విచారిస్తున్నాం. దీనిని ప్రతికూల సవాలుగా చూడటానికి బదులుగా కోర్టు, ప్రభుత్వం.. దేశంలోని లక్షల మంది డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన సమస్యగా చూసేందుకు భాగస్వామ్యమయ్యాం. వివిధ వ్యవస్థల అంతిమ లక్ష్యం దేశాభివృద్ధి, సమగ్రతే’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. -
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్ప్రదేశ్లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 21 లక్షల మంది బలి
ఆరుబయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్లో ఏటా 21.8 లక్షల మంది బలవుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. -
లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు
లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు