యాపిల్ ఫోన్ల హ్యాకింగ్?
తమ యాపిల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి.
అప్రమత్తత సందేశాలు వచ్చాయన్న విపక్ష ఎంపీలు
150 దేశాలకు ఇలాంటివి వెళ్లాయన్న కేంద్ర మంత్రి వైష్ణవ్
సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
అదానీని ప్రశ్నించినందుకే ఇదంతా చేస్తున్నారు: రాహుల్
దిల్లీ, ఈనాడు-దిల్లీ: తమ యాపిల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి, సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం జరుగుతోందని ఈ హెచ్చరికల్లో ఉన్నట్లు మహువా మొయిత్రా (తృణమూల్), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), శశిథరూర్ (కాంగ్రెస్), రాఘవ్ చడ్డా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) వంటి పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తంచేశారు. సందేశాల స్క్రీన్షాట్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హోదా, లేదా తమ చర్యల వల్ల హ్యాకర్లు వ్యక్తిగతంగా వారిని ఎంపిక చేసుకున్నట్లు ఈ సందేశాల్లో ఉంది. హ్యాకింగ్ జరిగితే డేటా, కెమెరా, మైక్రోఫోన్ సహా అంతా ఎక్కడో దూరాన ఉన్నవారి చేతికి చిక్కుతుందని తెలిపింది. ఇది తప్పుడు హెచ్చరిక కూడా కావొచ్చని చెబుతూనే ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోవాలని యాపిల్ తెలిపినట్లు శశిథరూర్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఇలాంటిది వచ్చినట్లు తెలుస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్లకూ ఇదే సందేశం వచ్చింది. పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ప్రభుత్వం అనుచితంగా కల్పిస్తున్న లబ్ధి గురించి ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా విపక్ష నేతల ఫోన్లలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మండిపడ్డారు.
సీరియస్గా తీసుకుంటున్నాం: వైష్ణవ్
గోప్యత, డేటాను కాపాడడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. హ్యాకింగ్ జరిగినట్లు వ్యక్తమైన అనుమానాలపై నిగ్గు తేల్చేందుకు ‘కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని ప్రకటించారు. యాపిల్ ఇలాంటి సందేశాలను 150 దేశాలకు ఇచ్చిందని చెప్పారు. వినియోగదారుల అనుమతి లేనిదే ఏమాత్రం ఫోన్లలోకి చొరబడడం సాధ్యంకాని రీతిలో ఐడీలను నిగూఢపరిచినట్లు యాపిల్ స్పష్టం చేసిందన్నారు. యాపిల్ పరికరాలు భద్రమైనవైతే 150 దేశాల ప్రజలకు నోటిఫికేషన్లు ఎందుకు వచ్చాయో ఆ సంస్థ స్పష్టతనివ్వాలని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు వస్తుంటాయి: యాపిల్
ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఈ ఆరోపణలపై స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమంది. ‘యాపిల్ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు అయిఉండొచ్చు. కొన్ని దాడులను గుర్తించలేం కూడా. నోటిఫికేషన్ జారీకి కారణాలను వెల్లడించలేం. దానిని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకునే అవకాశముంది’ అని తెలిపింది. సంప్రదాయ సైబర్ నేరగాళ్లతో పోలిస్తే ప్రభుత్వ సహకారంతో దాడులు చేసేవారు అసాధారణ వనరుల్ని వినియోగిస్తారని, వారిని గుర్తించి కళ్లెం వేయడం కష్టమని పేర్కొంది. ఈ-మెయిల్ అటాచ్మెంట్లు, ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపి హ్యాక్ చేస్తారని, అలాంటివి తెరవవద్దని హెచ్చరించింది. ప్రాయోజిత దాడులు అధునాతనంగా ఉంటాయని, వాటికి బాగా నిధులు లభిస్తుంటాయని పేర్కొంది.
ప్రధాని ప్రాణం ఆ చిలుకలో ఉంది: కాంగ్రెస్
ప్రధాని మోదీ ప్రాణం అదానీ అనే చిలుకలో ఉందని, అదానీని ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీల ఫోన్లలోకి చొరబడుతోందని రాహుల్ గాంధీ దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అదానీపై ఎవరు విమర్శలు గుప్పించినా వెంటనే నిఘావర్గాలు, ఈడీ, సీబీఐల దాడి మొదలవుతోందని పేర్కొన్నారు. ప్రధాని మొదటి స్థానంలో, అదానీ రెండో స్థానంలో, అమిత్షా మూడో స్థానంలో ఉంటారని ఇదివరకు తాను అనుకునేవాడినని, కానీ అదానీ తర్వాతి స్థానాల్లో మిగతా ఇద్దరు ఉన్నట్లు రూఢీ అయిందన్నారు. మన్మోహన్సింగ్, వాజ్పేయీ వంటి నేతల సర్కార్ల హయాంలో ఇలాంటివి జరిగిఉంటే ప్రభుత్వాలు కూలిపోయేవన్నారు. దేశంలో మౌలిక వసతులన్నింటినీ అదానీకే అప్పగించారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడడంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమన్నారు. కావాలంటే తన ఫోన్ ఇస్తానని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. ఈస్టిండియా కంపెనీ తరహా గుత్తాధిపత్యంలో మన దేశం ఉందని చెప్పారు. అదానీపై వ్యక్తిగతంగా తనకు వ్యతిరేకత లేదనీ, ఆయన గుత్తాధిపత్య ధోరణిపైనే పోరాడుతున్నానని అన్నారు.
నా ఫోన్కూ హ్యాక్ సందేశం వచ్చింది: మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: తనకు ఫోన్కు కూడా హ్యాక్ అయినట్లుసందేశం వచ్చిందని మంత్రి కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు భాజపా ఎంతకైనా దిగజారుతుందని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. -
క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట!
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
విదేశీయులకు విద్యానంతరం రెండేళ్ల వీసా కొనసాగించాలి
విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, అందుకోసం జారీచేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. -
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ మోదీ అంత్యక్రియలు
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పట్నాలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. -
రాగి గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు
రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలో రాగి గనుల్లో మంగళవారం ప్రమాదం సంభవించింది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్ కుప్పకూలింది. -
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (ఎస్యూఎన్వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. -
అంబేడ్కర్ పేరును కేజ్రీవాల్ వినియోగించకుండా అడ్డుకోవాలంటూ పిల్
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రాజకీయ నాయకులు ఎవరూ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. -
ఐఎంఏ అధ్యక్షుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు ఆర్.వి.అశోకన్ చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఆయన బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్ను తిరస్కరిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
-
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
-
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
-
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్