హుగ్లీ నీటి అడుగున మెట్రో హైలెస్సా
భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించనున్నారు.
దేశంలోనే తొలి నదీగర్భ రైలు ప్రయాణం
కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
కోల్కతా: భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా, బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హావ్డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనెడ్, మహాకారణ్, హావ్డా, హావ్డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.
బ్రిటన్ సరసన భారత్
మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకురాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీటు రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గాస్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికతను యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్ఠాత్మక హుగ్లీ అండర్వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కూ ఈ ఘనత దక్కింది. టన్నెల్ను తవ్వడానికి బాహుబలి యంత్రాలను వాడారు. జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణపనులను త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలుకాగా, హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణపనులు 2017లో ప్రారంభించారు. ఈ అండర్వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలున్నాయి. వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు.
మధ్యలో మెట్రో ఆగితే?
కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురవకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజరు ఉదయ్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఉందన్నారు. దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయుకాలుష్యం తగ్గుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి