గంపగుత్త అధికారం పార్లమెంటుకు లేదు
గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గనులు, ఖనిజాల అభివృద్ధిపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలకూ వాటిపై నియంత్రణాధికారం, అభివృద్ధి హక్కులుంటాయని బుధవారం తేల్చి చెప్పింది. ‘ఖనిజాలపై పార్లమెంటుకున్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని లిస్టు 1లో ఉన్న 54వ ఎంట్రీ ఈ విషయంలో పార్లమెంటుకు పూర్తి అధికారం ఇవ్వలేదు. లిస్టు 2లో ఉన్న 23వ ఎంట్రీ.. రాష్ట్రాలకు గనులు, ఖనిజాలపై నియంత్రణ, అభివృద్ధి అధికారం ఉంటుందని స్పష్టం చేస్తోంది’ అని పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసిహ్ ఉన్నారు. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్) ప్రకారం.. ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారముందని మైనింగ్ కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పు చెప్పింది. అయితే 2004లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వర్సెస్ కేశోరాం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసులో తీర్పు చెబుతూ.. 1989 నాటి తీర్పులో అచ్చుతప్పులు దొర్లాయని, రాయల్టీ.. పన్ను కాబోదని స్పష్టం చేసింది. అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు నివేదించింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM