కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి.
ఏడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సెషన్ నిడివి ఆరు నెలలకు పైనే..
ప్రొరోగ్ చేయకుండా వాయిదాతో నెట్టుకొచ్చారు
2023లో చట్టసభల పోకడలపై మేధోమథన సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక
కొన్ని రాష్ట్రాల్లో బిల్లులకు గవర్నర్ల ఆమోద ముద్ర పొందటానికి సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి
దిల్లీ: గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రొరోగ్ చేయకుండా ఆరు నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగ్లు నిర్వహించారు. సభను ఒకసారి ప్రొరోగ్ చేస్తే మళ్లీ భేటీ కావడానికి గవర్నర్ సమ్మతిని పొందాల్సి రావడం కూడా దీని కారణమని తెలుస్తోంది. మేధోమథన సంస్థ పీఆర్ఎస్ లేజిస్లేటివ్ రీసెర్చ్ వివిధ రాష్ట్ర అసెంబ్లీల పోకడపై అసక్తికరమైన విశేషాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం...
- 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు భేటీ అయ్యాయి. ప్రతి సిట్టింగ్లో సగటు సమావేశ సమయం అయిదు గంటలు.
- ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్ను ప్రొరోగ్ చేయకుండా...ఆరు నెలలకు పైగానే సమావేశంలో ఉన్నట్లు చూపారు. ఒక సిట్టింగ్కు మరో సిట్టింగ్కు మధ్య వ్యవధి రోజులు, వారాలు కాకుండా కొన్ని నెలలు ఉండటం గమనార్హం.
- రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు ఆరు నెలల వ్యవధిలో కనీసం ఒకసారైనా సమావేశం కావాలి. అయితే, 62శాతం సిట్టింగ్లు బడ్జెట్ సెషన్ అప్పుడే జరిగాయి.
- దిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఒక సెషన్ 2023 మార్చి నుంచి అదే ఏడాది డిసెంబరు వరకు కొనసా...గింది. ఈ వ్యవధిలో జరిగిన సిట్టింగ్లు 14 మాత్రమే.
- పంజాబ్ అసెంబ్లీ 2023 మార్చి నుంచి అక్టోబరు వరకు 10 సార్లు మాత్రమే బేటీ అయ్యింది.
- బడ్జెట్ సెషన్ కోసం గవర్నర్ శాసనసభను సమావేశపరచడం లేదని ఆరోపిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర మంత్రిమండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
- రాజస్థాన్ అసెంబ్లీ సెషన్ కూడా 2023 జనవరి నుంచి ఆగస్టు వరకు కొనసా...గింది. 2021, 2022లలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒకేఒక్క సెషన్ను(జనవరి-డిసెంబరు) నిర్వహించింది.
- పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సెషన్ 2023 జులైలో ప్రారంభమై... 2024 మార్చి వరకు ప్రొరోగ్ కాలేదు. బడ్జెట్ ఆమోదం కోసం ఫిబ్రవరిలో సమావేశమైన శాసనసభ... సంప్రదాయానికి భిన్నంగా గవర్నర్ ప్రసంగంలేకుండానే మొదలైంది.
- సిక్కిం, తమిళనాడు, తెలంగాణలలో ఒక్కో సెషన్ ఏడాదికిపైగానే కొనసాగింది.
- సిక్కింలో 2022 మార్చిలో మొదలైన సెషన్ 2023 ఏప్రిల్లో ప్రొరోగ్ అయ్యింది.
- తెలంగాణలో ఒక సెషన్ 2021 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టు వరకు కొనసాగింది.
చర్చించకుండానే బిల్లుల ఆమోదం
- 2023లో 44శాతం బిల్లులు అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన రోజే దాదాపు చర్చించకుండానే ఆమోదం పొందాయి. గుజరాత్, ఝార్ఖండ్, మిజోరం, పుదుచ్చేరి, పంజాబ్ అసెంబ్లీల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా కనిపించింది.
- కేరళ, మేఘాలయ అసెంబ్లీల్లో మాత్రం 90 శాతం బిల్లులపై సగటున 5 రోజులకు పైగా చర్చించారు.
- శాసనసభలు ఆమోదించిన 59 శాతం బిల్లులకు మాత్రమే గవర్నర్ల సమ్మతి నెలలోపే లభించింది. అయితే, బిహార్, గుజరాత్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లో 100శాతం బిల్లులు నెల లోపే గవర్నర్ల ఆమోద ముద్ర పొందాయి.
- రెండు నెలలకు పైగా గవర్నర్ల ఆమోదం లభించని బిల్లులు అస్సాంలో 80శాతం, నాగాలాండ్-57%, ఝార్ఖండ్-50%, పశ్చిమబెంగాల్లో 50శాతంగా ఉన్నాయి.
- అసెంబ్లీ సమ్మతించిన తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం పొందటానికి పట్టిన సగటు సమయం పశ్చిమబెంగాల్లో 92 రోజులు, అస్సాంలో 73 రోజులు, ఝార్ఖండ్లో 72 రోజులు, కేరళలో 67 రోజులు, హిమాచల్ప్రదేశ్లో 55 రోజులు.
- ఎనిమిది బిల్లుల ఆమోదానికి గవర్నర్ జాప్యం చేస్తుండడంతో కేరళ ప్రభుత్వం 2023 నవంబరులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాయి.
- ఏడాదిలో అత్యధిక రోజులు సమావేశమైన శాసనసభగా..... మహారాష్ట్ర అసెంబ్లీ(41) ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్(40), కర్ణాటక (39) ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ అసెంబ్లీలు 20 రోజుల కన్నా తక్కువగానే భేటీ అయ్యాయి.
- అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలు 10 కన్నా తక్కువ రోజులే సమావేశమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలిటికల్ యాడ్లలో భాజపా దూకుడు.. ఈసీ లిస్టులో టాప్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. -
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా తిహాడ్ జైలుకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
ప్రజ్వల్ వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను లీక్ చేయడం వెనక ‘భారీ తిమింగలం’ ఉందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. -
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
Mumbai hoarding collapse: గాలివానలకు హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో యాడ్ ఏజెన్సీ యజమాని గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి జరగడం నిజమేనని ఆ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ కూడా నిందితుల జాబితాలో చేరనుంది. -
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
దేశంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. -
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు (Supreme Court) .. మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించాలని సూచించింది. -
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
విమానం రద్దు కారణంగా ఒమన్లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను.. బతికుండగా చూడలేకపోయానంటూ కేరళకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
Mumbai hoarding collapse: బలమైన ఈదురుగాలుల ధాటికి సోమవారం ముంబయిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. -
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
ఎన్నికల వేళ ఆప్ గంభీరమైన వివాదంలో చిక్కుకొంది. ఆ పార్టీ మహిళా ఎంపీ ఏకంగా సీఎం ఇంట్లో దాడికి గురైనట్లు పోలీసులకు వెల్లడించారు. -
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
నేడు వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ (Modi) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
ముంబయి విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల బంగారం పట్టివేత
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్లు విలువ చేసే బంగారం పట్టుబడింది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ