మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌

మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన..

Published : 18 Aug 2020 23:19 IST

దిల్లీ: మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్‌ తథాగత రాయ్‌ పదవీకాలం ముగియడంతో గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. సత్యపాల్‌ మాలిక్‌ 2019 నుంచి గోవా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అంతకముందు ఆయన జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా విధులు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని